క్షమాపణలు చెప్పిన అంబటి రాంబాబు

వైఎస్ఆర్సిపి నేత అంబటి రాంబాబు తమ కులాన్ని ఉద్దేశించి ఇటీవల చేసిన వ్యాఖ్యల పై క్షమాపణలు చెప్పారు. వివరాల్లోకి వెళితే..

మొన్నామధ్య ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబటి రాంబాబు తమ కాపు కులం పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కాపులు తాగుబోతులు అని, మాంసం ఎక్కువ తింటారని, ఆవేశపరులు అని ఆయన ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు ఆయన సొంత సామాజికవర్గానికి చెందిన ప్రజలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. తమ కులానికి చెందిన అందరినీ ఒకే గాటన కట్టేసి కించపరుస్తూ మాట్లాడటం ఏమిటని వారు సోషల్ మీడియా వేదికగా ఆయన ని విమర్శించారు. బహుశా రానున్న మంత్రివర్గ విస్తరణలో అవకాశం కోసం , జగన్ ని మెప్పించడం కోసం , తమ సొంత సామాజిక వర్గాన్ని కించపరచడానికి అంబటి రాంబాబు వెనుకాడడం లేదంటూ సోషల్ మీడియా లో కాపు కులానికి చెందిన వ్యక్తులు అంబటి రాంబాబుని దుయ్యబట్టారు.

అయితే అంబటి రాంబాబు తాజాగా తన వ్యాఖ్యల పట్ల చింతిస్తూ మరొక వీడియో చేశారు. తాను యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తన కులపు సోదరులను బాధించి నట్లు తన దృష్టికి వచ్చిందని ఆ సమయంలో తాను అలా అని ఉండకూడదని ఆ తర్వాత తాను పశ్చాత్తాప పడ్డానని, కాపు సోదరులు అందరికీ తన తరఫునుండి ఈ విషయం పట్ల బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని ఆయన వీడియోలో వ్యాఖ్యానించారు.

మొత్తానికి అంబటి రాంబాబు వ్యవహారం అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్నట్లు తయారైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close