అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే… ‘క‌ల్కి’ కోసం ఆయ‌న మ‌రింత ఎత్తు పెరిగారు. నాగ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా రూపొందిన చిత్రం ‘క‌ల్కి’. ఇందులో అశ్వ‌ద్ధామ పాత్ర‌లో అమితాబ్ బ‌చ్చ‌న్ క‌నిపించ‌నున్నారు. ఇటీవ‌ల ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన గ్లింప్స్ కూడా విడుద‌లైంది. ఈ సినిమాలో ఆయ‌న రెండు గెట‌ప్పుల‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. ఓ పాత్ర కోసం ఏఐ (ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌) స‌హాయం తీసుకొని, ఆయ‌న్ని యంగ్ అమితాబ్ గా మార్చేశారు. అంతేకాదు.. అమితాబ్ హైట్ పెంచి మ‌రీ చూపించే ప్ర‌య‌త్నం చేశార‌ని స‌మాచారం.

పురాణాల్లోని ఆశ్వ‌ద్ధామ పాత్ర‌ని రిఫ‌రెన్స్ గా తీసుకొని ఆ పాత్ర‌ని తీర్చిదిద్దారు. అశ్వ‌ద్ధామ‌ని మిగిలిన పాత్ర‌ల‌కంటే పొడుగ్గా చూపించాల‌న్న‌ది నాగ అశ్విన్ ఆలోచ‌న‌. అయితే ప్ర‌భాస్ హైట్ కూడా ఇంచుమించుగా ఆరు అడుగుల పైమాటే. అందుకే ప్ర‌భాస్ కంటే ఎత్తులో ఆ పాత్ర‌ని చూపించే క్ర‌మంలో అమితాబ్ ఎత్తుని మ‌రికొంత పెంచి, చూపించార‌ని తెలుస్తోంది. అమితాబ్ ఇన్ని వంద‌ల సినిమాలు చేసినా, ఎవ‌రూ ఈ త‌ర‌హా ప్ర‌య‌త్నం చేయ‌లేదు. అశ్వ‌ద్ధామ పాత్ర ఔచిత్సం కోసం, అమితాబ్ పాత్ర‌ని నాగ అశ్విన్ డిజైన్ చేసుకొన్న ప‌ద్ధ‌తి ప్ర‌కారం, ఆ పాత్ర హైట్ పెంచాల్సివ‌చ్చింద‌ని స‌మాచారం. అంతే కాదు.. ఈ సినిమాలో మిగిలిన పాత్ర‌ల విష‌యంలోనూ నాగ అశ్విన్ ఓ థియ‌రీ ఫాలో అయ్యార్ట‌. అవ‌న్నీ తెలియాలంటే.. నాగ అశ్విన్ ఈ సినిమా గురించిన విపుల‌మైన స‌మాచారం ప్రేక్ష‌కుల‌తో పంచుకోవాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close