ధోనీపై వారెంటును వెనక్కి తీసుకొన్న కోర్టు

టీమ్ ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి జారీ చేసిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంటును అనంతపురం కోర్టు మంగళవారం వెనక్కి తీసుకొంది. బిజినెస్ ఇండియా మ్యాగజిన్ కవర్ పేజీపై విష్ణుమూర్తి అవతారంలో ధోనీ బూట్లు, కూల్ డ్రింక్ బాటిల్, దుస్తులు వగైరా పట్టుకొని ఉన్న చిత్రం ప్రచురించబడినందుకు అతనిపై బెంగళూరు మరియు అనంతపురం కోర్టులలో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి.

ధోనీ తరపున లాయర్లు బెంగళూరు కోర్టులో కేసుకు హాజరయ్యారు కానీ అనంతపురం కోర్టుకి ధోనీ తరపున ఎవరూ హాజరు అవలేదు. కోర్టు పంపిన నోటీసులు కూడా తీసుకోలేదు. రెండు మూడు సార్లు నోటీసులు పంపినా వాటికి ధోనీ తరపున ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఆగ్రహించిన అనంతపురం కోర్టు అతనిని అరెస్ట్ చేసేందుకు జనవరి 7న నాన్ బెయిలబుల్ వారెంటును జారీ చేసింది.

ఈ విషయం తెలిసిన ధోనీ న్యాయవాదులు రజనీష్ చోప్రా మరియు పంకజ్ బాగ్ల అనంతపురం కోర్టులో ఇవ్వాళ్ళ ధోనీ తరపున హాజరయ్యి, ధోనీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో మ్యాచ్ ఆడేందుకు వెళ్లినందున కోర్టు పంపిన అరెస్ట్ వారెంట్ ను అందుకోలేకపోయారని, కనుక వారెంటును ఉపసంహరించుకోవలసిందిగా అభ్యర్ధించారు. కోర్టు వారి అభ్యర్ధనను మన్నించి ఫిబ్రవరి 25న ధోనీ స్వయంగా కోర్టు ముందు హాజరు కావలసిందిగా ఆదేశించి, అతనిపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంటును ఉపసంహరించుకొంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close