నిన్న పల్లెటూరి అమ్మాయిగా.. ఈరోజు పోలీస్‌ ఆఫీసర్‌గా!

టి.వి. యాంకర్‌గా తన గ్లామర్‌తో అందర్నీ ఆకట్టుకోవడమే కాకుండా లేటెస్ట్‌గా కింగ్‌ నాగార్జునతో కలిసి ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంలో ఓ క్యారెక్టర్‌ చేసిన అనసూయ ఇప్పుడు పోలీస్‌ ఆఫీసర్‌గా కొత్త గెటప్‌లో కనిపించబోతోంది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా లంగా ఓణీలో అందర్నీ అలరించిన అనసూయ ఇప్పుడు రివాల్వర్‌ చేత పట్టుకొని శత్రువులను వేటాడే పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తోంది. పివిపి సినిమా పతాకంపై రవికాంత్‌ దర్శకత్వంలో అడవిశేష్‌, అదాశర్మ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ‘క్షణం’ చిత్రంలో అనసూయ ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తోంది.
కొత్త గెటప్‌లో రివాల్వర్‌ పట్టుకొని ఫోజులివ్వడం కాకుండా ఈ క్యారెక్టర్‌ చెయ్యడానికి అనసూయ చాలా హోమ్‌వర్క్‌ చేసిందట. చాలామంది పోలీస్‌ ఆఫీసర్లను కలుసుకొని తనకు తెలియని ఎన్నో విషయాల్ని తెలుసుకొని వాటిని తను చేస్తున్న క్యారెక్టర్‌ కోసం ఉపయోగించుకుంది. ఆమె పెర్‌ఫార్మెన్స్‌ని యూనిట్‌లోని అందరూ అప్రిషియేట్‌ చేస్తున్నారట. ‘క్షణం’ చిత్రంలో అనసూయ చేస్తున్న ఈ క్యారెక్టర్‌ ద్వారా చాలా మంచి పేరు తెచ్చుకుంటుందని యూనిట్‌ సభ్యులు చెప్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close