‘లేటు’ నిర్ణయం: హెచ్‌సీయూ విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేత

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ ఆత్మహత్యకు కారణమైన సస్పెన్షన్‌పై వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎట్టకేలకు స్పందించింది. సస్పెన్షన్‌కు గురైన రోహిత్ సహ విద్యార్థులు నలుగురిపై ఆ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇవాళ నిర్ణయం తీసుకుంది. ఆ నలుగురి పేర్లు ప్రశాంత్, శేషయ్య, విజయ్, సుంకన్న. తరగతులు, పరిశోధనలకు ఆటంకం కలగకుండా చూడాలని, సమస్యలేమైనా ఉంటే అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకుందామని వీసీ అప్పారావు పిలుపునిచ్చారు. వర్సిటీలో ప్రశాంతత నెలకొనటానికి సహకరించాలని అభ్యర్థించారు. అయితే, వీసీని తొలగించేవరకు, రోహిత్‌కు న్యాయం జరిగేవరకు ఆందోళన కొనసాగిస్తామని అతని సహచరులు చెప్పారు. ఈ నిర్ణయం పది రోజులముందు తీసుకుని ఉంటే ఒక ప్రాణం నిలిచి ఉండేదని అన్నారు. ఇప్పటివరకు, వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున సస్పెన్షన్‌ను ఎత్తేయలేమని అప్పారావు చెబుతూ వస్తున్నారని, మరి ఇవాళ ఎందుకు ఎత్తేశారని ప్రశ్నించారు. మరోవైపు, వీసీ అప్పారావు తన కొడుకు చేసిన తప్పేమిటే చెప్పాలని రోహిత్ తల్లి రాధిక అన్నారు. రోహిత్ చనిపోయాక వీసీ అప్పారావు తనను కలుస్తానని ప్రయత్నించారని, ఏ తప్పూ చేయకపోతే ఆయన దొంగతనంగా తనను కలవటానికి వస్తానని ఎందుకంటున్నారని ప్రశ్నించారు. న్యాయంకోసం అవసరమైతే ఢిల్లీ వెళతానని చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close