“సచ్చిందిరా గొర్రె”లో కథానాయికగా పాపులర్ యాంకర్ అనసూయ

శ్రీనివాసరెడ్డి, టిల్లు వేణు, జబర్దస్త్ రాకేష్, శివారెడ్డి, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “సచ్చింది రా గొర్రె”. శ్రీధర్‌ రెడ్డి యార్వ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దీపక్‌ ముకుత్, యన్.యమ్.పాషాలు అపర్ణ కిటే తో కలిసి సోహామ్ రాక్ స్టార్ ఎంటర్ టైన్మెంట్-ఎంటర్ టైన్మెంట్ స్టూడియో బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రంలో కథానాయికగా పాపులర్ యాంకర్ అనసూయ నటించనుంది. త్వరలోనే షూటింగ్ లో పాలుపంచుకోనున్న అనసూయ ఈ క్రేజీ ప్రోజెక్ట్ కి అదనపు ఆకర్షణగా నిలవనుంది.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. “ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ప్రతి సన్నివేశం నవ్వులు పండిస్తుంది. దర్శకుడిగా ఇదే నా తొలి చిత్రమైనప్పటికీ.. డిఫరెంట్ జోనర్ లో డార్క్ కామెడీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. అనసూయ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది” అన్నారు.

అనసూయ మాట్లాడుతూ.. “పర్టీక్యులర్ గా హీరో-హీరోయిన్ అనేది కాకుండా కేవలం కథే హీరోగా నడిచే సినిమా ఇది. అందులోనూ ఈ సినిమాలో తెలంగాణా సాంస్కృతిక గీతం అయిన ఒగ్గు కథ ఉండడం నన్ను అమితంగా ఆకట్టుకుంది. సినిమాటిక్ గా ఉంటూనే చాలా ఇంట్రెస్టింగ్ గా సాగేలా “సచ్చిందిరా గొర్రె” ఉండబోతోంది” అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: సంతోష్‌కుమార్, ఛాయాగ్రహణం: రమణ సాల్వ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.