ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏపీలో కొంటే ఖర్చయిపోయినట్లే !

ఓలా సంస్థ ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్ముతోంది. నేరుగా ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే డోర్ డెలివరీ ఇస్తారు. ఈ సంస్థ తాజాగా విడుదల చేసిన ఎస్ వన్ ప్రో మోడల్ కొనాలని యాప్‌లో ప్రయత్నిస్తే… హైదరాబాద్‌లో అన్ని ఖర్చులూ కలిపి 1 లక్షా 80వేలు చూపిస్తోంది. అదే గుంటూరులో డెలివరీ ఇవ్వాలని ఆప్షన్ పెట్టుకుంటే మాత్రం రూ. రెండు లక్షలపైనే చూపిస్తోంది. ఎక్కడా తేడా వచ్చిందంటే.. రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ దగ్గర. తెలంగాణలో రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ ఐదు వందల రూపాయలు ఉంటే… ఏపీలో ఏకంగా ఇరవై వేల పైనే ఉంది. దీనికి కారణం ఎలక్ట్రిక్ వాహనాలపై ఏపీలో పూర్తి స్థాయిలో పన్ను బాదేస్తున్నారు. తెలంగాణలో మాత్రం రాయితీలు ఇస్తున్నారు.

పన్నులు పిండుకోవడంలో చాన్స్ వస్తే దేన్నీ వదులుకోని రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై వాజీవితకాల పన్ను 12శాతం విధిస్తూ రాష్ట్ర రవాణాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో విద్యుత్‌ వాహనాల రేట్లు భారీగా పెరిగాయి. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్యావరణ పరిరక్షణ, ఇంధన వినియోగం తగ్గించే చర్యల్లో భాగంగా 2018 నుంచి కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ ప్రకటించింది. ఫాస్టర్‌ అడాప్షన్‌ ఆఫ్‌ మ్యానుఫ్యాక్షరింగ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ఇన్‌ ఇండియా పథకంలో భాగంగా 40శాతం వరకు రాయితీ సౌకర్యం ఇవ్వడంతో పాటు రిజిస్ట్రేషన్ ట్యాక్స్ మినహాయించారు.

ఆదాయం కోసం రాష్ట్రంలో వివిధ రకాల విద్యుత్‌ వాహనాలపై జీవిత పన్ను వసూలు చేస్తూండటంతో కొనుగోళ్లు తగ్గిపోతున్నాయి. రూ.లక్ష విలువైన బైకుపై రూ.12వేలు జీవిత పన్నుగా చెల్లించాల్సి వస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే పెట్రోలు రేట్లు ఏపీలో అధికంగా ఉన్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్‌ బైకులు కొనుగోలు చేయాలన్న వాహనదారులకు ప్రభుత్వం మరో విధంగా పిండుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పల్లీబఠాణి కామెంట్స్‌తో రాకేష్ రెడ్డిని ముంచిన కేటీఆర్

బిట్స్ పిలానీ గొప్ప కావొచ్చు కానీ మిగతా గ్రాడ్యూయేట్స్ అంతా పల్లీ బఠాణీలు అంటే ఎలా ?. కేటీఆర్ ఇది ఆలోచించలేదు. ప్రాస బాగుంది కదా అని అనేశారు. ఇప్పుడు...

నో రిఫండ్ బుకింగ్ – 9కి విశాఖ హోటల్స్ రెడీ !

వైసీపీ నేతలు చేస్తున్న అతి కారణంగా విశాఖలో 9వ తేదీన హోటల్స్ నిండిపోతున్నాయని సోషల్ మీడియాలో అనుకుంటున్నారు. కానీ ఆ రోజున విశాఖలో ఉన్న హోటళ్లలో ఇప్పటికే వందల కొద్ది రూములు...

ఆర్కే పలుకు : మీడియా విశ్వసనీయతపై ఆర్కే ఆవేదన

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం కొత్త పలుకులో తెలుగు మీడియా విశ్వసనీయత కోల్పోతోందని.. ప్రజలు ఎవరూ నమ్మలేని పరిస్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేయడానికి కేటాయించారు. చాలా కష్టపడి...

విశ్వ‌క్‌సేన్ కోసం బాల‌య్య‌

నంద‌మూరి హీరోలంటే విశ్వ‌క్‌సేన్‌కు ప్ర‌త్యేక‌మైన అభిమానం. ఎన్టీఆర్‌కు విశ్వ‌క్ వీరాభిమాని. ఎప్పుడు ఎన్టీఆర్ ప్ర‌స్తావన వ‌చ్చినా, ఊగిపోతాడు. బాల‌కృష్ణ‌తో కూడా మంచి అనుబంధ‌మే ఉంది. విశ్వ‌క్‌సేన్ గ‌త చిత్రానికి ఎన్టీఆర్ గెస్ట్ గా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close