నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలు మొదలవుతాయి. కానీ కేవలం ఐదు రోజులు అంటే ఈనెల 22 వరకు మాత్రమే ఈ సమావేశాలు జరుగుతాయి. అవసరమయితే ఉభయసభల సమావేశాలను ఒక రోజు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవ్వాళ్ళ ఉదయం 8.45 గంటలకు స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బిఎసి) సమావేశం కానుంది. ఈ సమావేశాలలో చర్చించాల్సిన అంశాలను ఖరారు చేస్తారు. సమావేశాల అజెండా ఖరారు అయిన తరువాత ఉభయ సభల సమావేశాలు మొదలవుతాయి.

ఇసుక మాఫియా, కల్తీ మద్యం, కాల్ మనీ, సెక్స్ రాకెట్ ఇలాగ ఒకదాని తరువాత మరొకటి రాష్ట్రంలో బయట పడుతున్న అక్రమ వ్యవహారాల కారణంగా ఈసారి సమావేశాలలో తెదేపా ప్రభుత్వం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమావేశాలలో ఈ వ్యవహరాలన్నిటిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రధాన ప్రతిపక్షమయిన వైకాపా నిన్ననే ప్రకటించింది. అలాగే బాక్సైట్ తవ్వకాలను అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల విషయంపై కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రకటించింది. వైకాపా విమర్శలను తిప్పి కొట్టేందుకు తెదేపా వద్ద బలమయిన ఏమీ కనబడటం లేదు. కాల్ మనీ వ్యవహారంలో కొందరు వైకాపా నేతల పేర్లు కూడా వినబడ్డాయి. కనుక ఆ ఒక్క ఆధారంతోనే వైకాపాను డ్డీ కొనవలసి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నిర్లక్ష్యమే ముంచింది…కాళేశ్వరంపై నిపుణుల మధ్యంతర నివేదిక

కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ డ్యాం సేఫ్టీ మధ్యంతర నివేదికను అందజేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రభుత్వానికి సూచించింది.వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని...

పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ – విప్లవమే !

ఐదేళ్ల పాలనలో తాను చాలా విప్లవాలు తెచ్చానని జగన్ రెడ్డి చెబుతూ ఉంటారు. విప్లవం అంటే ఆ రేంజ్ అనుకుంటున్నారో కానీ ఆయన కానీ ఆయన రచయితలు కానీ ఆ పదాన్ని...

యార్లగడ్డ లక్ష్మీ ప్రసాదూ కూటమికే ప్రచారం చేస్తారట !

జగన్ ఓటమి ఖాయమని తేలిపోయిందని అంచనాకు వచ్చిన భజన బ్యాచ్ లో కొంత మంది తమ పాత పరిచయాలను అడ్డం పెట్టుకుని బయటకు వచ్చి కూటమికి మద్దతు ప్రకటిస్తున్నారు. యార్లగడ్డ...

గ్రేటర్ లో వర్షం పడితే ఇంతేనా..!?

గ్రేటర్ హైదరాబాద్ లో మంగళవారం కురిసిన కుండపోత వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరదనీరుతో రోడ్లు, వీధులన్నీ నిండిపోయాయి. దాదాపు రెండు గంటలపాటు వర్షం దంచి కొట్టడంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close