నిమ్మగడ్డను కలిసిన సీఎస్..! రివర్స్ వాదన..?

స్థానిక ఎన్నికల నిర్వహణపై అభిప్రాయం చెప్పాలని.. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. పార్టీ పరంగా తన అభిప్రాయం చెప్పడానికి నిరాకరించిన వైసీపీ… అధికారికంగా మాత్రం సీఎస్ నీలం సహానితో నిమ్మగడ్డకు ప్రభుత్వ ఆలోచనను చర్చించేందుకు పంపించింది. ప్రస్తుతం కరోనా కేసులు ఉద్ధృతంగా ఉన్నందున.. మళ్లీ నవంబర్‌లో సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నందున.. ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు నిర్వహించే ఉద్దేశంలో లేదని నీలం సహాని చెప్పినట్లుగా తెలుస్తోంది. అందరి అభిప్రాయాలను తెలుసుకుని నిమ్మగడ్డ కోర్టుకు నివేదించే అవకాశం ఉంది.

దేశంలో కరోనా ఎమర్జెన్సీ విధించిన సమయంలో… ఎన్నికలు వాయిదా వేసినప్పుడు.. సీఎస్‌గా నీలం సహానీనే ఉన్నారు. అప్పుడు.. ఎన్నికల వాయిదా వేసినందుకు నీలం సహానీ.. ఎస్‌ఈసీకి ఘాటుగా లేఖలు రాశారు. అది వివాదాస్పదం కూడా అయింది. కరోనా ఉద్ధృతి పెరిగే సరికి ఇంకా చాలా సమయం ఉంటుందని.. ఎన్నికలు నిర్వహించాలని ఆ లే్ఖల్లో పేర్కొన్నారు. ఎస్‌ఈసీకీ సీఎస్ ఇలా లేఖ రాయడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధమన్న చర్చ జరిగింది. ఇప్పుడు మాత్రం రివర్స్‌లో నీలం సహానీ… ఎన్నికలు నిర్వహించవద్దని చెప్పడం ఆసక్తికరంగా మారింది.

ఉదయం రాజకీయ పార్టీల అభిప్రాయాలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుసుకున్నారు. తాము ఎన్నికల నిర్వహణ విషయంలో ఉత్తమమైన పద్దతుల్ని పాటిస్తున్నామని ఆయన చెబుతున్నారు. మూడు రోజుల కిందట.. ఎన్నికల నిర్వహణపై… సీఎంవో ఉన్నతాధికారి ప్రవీణ్ ప్రకాష్ సమీక్షా సమావేశం పెట్టాలనుకున్నారు. దానిపై.. నిమ్మగడ్డ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సారీ చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close