“జగతి” కేసులో తప్పంతా విజయసాయిదేనంటున్న జగన్ లాయర్లు

జగతి పబ్లికేషన్స్ కేసులో జగన్మోహన్ రెడ్డి కోర్టులో దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లలో ఆయన తరపు న్యాయవాదుల వాదన… వైసీపీలోనే సంభ్రమాశ్చర్యాలకు కారణం అవుతోంది. అసలు ఆ కేసులో తనకు సంబంధమే లేదని.. మొత్తం విజయసాయిరెడ్డినే చేశారన్నట్లుగా జగన్ తరపు న్యాయవాదులు వాదిస్తూండటమే దీనికి కారణం. జగతి పబ్లికేషన్స్‌ కేసులో దండమూడి అవినీంద్రకుమార్, మాధవ్ రామచంద్ర, టీఆర్ కన్నన్ అనే వ్యక్తులు 2007-2009 మధ్య రూ. 35 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టారు. షెర్ వాల్యూను.. డెలాయిట్‌తో కలిసి అక్రమంగా పెంచి.. చూపించి తమకు ఒక్కో షేర్‌ను విజయసాయిరెడ్డి రూ. 350కు అమ్మి మోసం చేశారని వారు ఫిర్యాదు చేశారు.

ఇప్పటి వరకూ తమకు పైసా కూడా డివిడెండ్ ఇవ్వలేదని.. వారంటున్నారు. ఈ మేరకు సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. దీనిపై అప్పట్లో జగతి పబ్లికేషన్స్ చైర్మన్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డిపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పటిషన్లలోనూ అదే చెబుతున్నారు. మోసపోయామని ఫిర్యాదు చేసిన ముగ్గురూ.. తన పేరును ఎక్కడా చెప్పలేదని.. తనకు సంబంధం లేదని.. తనను కేసు నుంచి డిశ్చార్జ్ చేయాలని జగన్ కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదుల వాదన  న్యాయవర్గాలను సైతం విస్మయానికి గురి చేస్తోంది. ఆర్థికపరమైన నేరాల్లో అంతిమంగా లబ్దిదారు ఎవరో చూస్తారు.

అసలు అప్పటికే ప్రారంభం కాని కంపెనీ విలువను.. రూ. 10 కూడా చేయని షేర్ వాల్యూను డెలాయిట్‌తో కలిసి రూ. 350కి పెంచి.. అమ్మించడం వల్ల విజయసాయిరెడ్డికి వచ్చిన లాభం ఏమిటి..?. ఆయనకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు కలిగినట్లుగా సీబీఐ ఇంత వరకూ చెప్పలేదు. ఆయన ఏం చేసినా జగన్మోహన్ రెడ్డికి ప్రయోజనం కల్పించడానికే చేశారని సులువుగానే అర్థం అవుతుంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తరపు లాయర్లు తనకేమీ తెలియదని… కోర్టులో వాదించడం.. ఆసక్తికర పరిణామంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close