డీజీపీని భరించలేకపోతున్న జగన్ !?

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని సీఎం జగన్ భరించలేకపోతున్నారన్న ప్రచారం ఆధికారవర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆయన పూర్తి స్థాయి డీజీపీ కాదు. అడహాక్ డీజీపీనే కేంద్రం ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఆ ప్రక్రియను ఏపీ ప్రభుత్వం త్వరగా పూర్తి చేయడం లేదు. కారణం ఏదైనా ఆయన డీజీపీగాఉన్నారు. కానీ జగన్ ఆలోచనలకు తగ్గట్లుగా ఆయన మసలుకోలేకపోతున్నారు. ఆయన కోరుకునే అరాచక స్థాయిని పోలీసులు అందుకోలేకపోతున్నారన్న గుసగుసలు వినిిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జగన్ పోలీసుల నుంచి ఇంకా చాలా దూకుడు కోరుకుంటున్నారు. కానీ లాంటిది కనపడటం లేదంటున్నారు.

అసలు సంబంధం లేని ఆదాయార్జన శాఖలపై సమీక్షలో సీఎం జగన్ ఏసీబీ డీజీగా రాజేంద్రనాథ్ రెడ్డిని తొలగించాలని స్పష్టం చేశారు. ఆయన అటు డీజీపీగా ఇటు ఏసీబీ డీజీగా ఉండలేరని చెప్పుకొచ్చారు. అందుకే ఆ సమీక్షలో తనకు ఎదురుగా కనిపించిన రవిశంకర్ అయ్యన్నార్ ను ఏసీబీ డీజీగా నియమించాలని జగన్ సూచించారు. కానీ రవిశంకర్ అయ్యన్నార్ కుఇంకా డీజీ హోదా రాలేదు. అంతసీనియర్ కాదు. ఆయన ఏడీజీనే. అది తెలియకుండా జగన్ ఆయనను నియమించాలన్నారు. పక్కన వాళ్లు చెప్పినా పట్టించుకోలేదు. ఆ నియామం జరుగుతుందో లేదో కానీ జగన్ మాత్రం అర్జంట్ డీజీపీ నిర్వహిస్తున్న ఓ కీలకమైన విభాగాన్ని ఆయన నుంచి తప్పించాలనుకున్నది మాత్రం స్పష్టమయిందంటున్నారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కొత్త డీజీపీ ఎంపిక విషయంలో కేంద్రం నిబంధనలు గుర్తు చేసినా లేదా జగనే ఆయన వద్దని కొత్త వారిని ఎంపిక చేసుకున్నా.. డీజీగా చేసి రవీంద్రనాథ్ రెడ్డి అప్రాధాన్య పోస్టులోకి వెళ్లాల్సి ఉంటుంది. అది ఆయనకు అవమానమే. ఏ పోస్టులో చేసినా… ఆయన హోదా తగ్గినట్లే. అయితే సీఎం జగన్ ఇలాంటివి పట్టించుకోరు. ముందు ముందు పోలీసు వర్గాల్లో అలజడి రేపే నిర్ణయాలు ఉంటాయన్న ప్రచారం మాత్రం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ రూ. 14వేల కోట్లు మంగళవారం ప్రజల ఖాతాల్లో వేస్తామని చెప్పడం లేదేంటి ?

తెలంగాణ ఎన్నికల సమయంలో రైతు బంధు రాజకీయం జరిగింది. ఎన్నికల సంఘం నిధులు జమ చేయడానికి అంగీకారం తెలిపింది. కానీ హరీష్ రావు దాన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకోవడంతో మళ్లీ...

ఎలక్షనీరింగ్ : అంచనాల్ని అందుకోలేకపోయిన వైసీపీ

ఈ సారి ఎన్నికల్లో వైసీపీ డబ్బుల పండగ చేస్తుందని ఓటర్లు ముఖ్యంగా వైసీపీకి చెందిన ఓటర్లు నమ్మకంతో ఉన్నారు. పార్టీ ద్వితీయ శ్రేణి క్యాడర్ కు కూడా రూ....

మోడీ దృష్టిలో జగన్‌ విలువ అంతే !

మోడీకి దత్తపుత్రుడినని అందుకే తాను ఇలా ఉన్నానని జగన్ అనుకుంటూ.. సర్వ అరాచకాలకు పాల్పడ్డారు. కానీ మోడీ దృష్టిలో జగన్ కు గుర్తింపు ఆయన ఓ రాష్ట్ర సీఎం.. తాను...

కేసీఆర్ నాన్ సీరియస్ పాలిటిక్స్ !

పదవిలో ఉన్నప్పుడు.. తన వెనుక బలం, బలగం ఉన్నప్పుడు కేసీఆర్ చెప్పినవి చాలా మందికి బాగానే ఉన్నాయి. కానీ ఆయన సర్వం కోల్పోయాక.. పార్టీ ఉనికే ప్రమాదంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close