రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ల చెల్లింపునకు అష్టకష్టాలు పడిన సర్కార్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి గురించి చాలా చర్చలు బయట జరుగుతున్నాయి కానీ.. అసలు వాస్తవం ఏమిటో బయటకు తెలియడం లేదు. జీతాలు, ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వాల్సిన సమయంలో… ఆర్థిక కష్టాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్బీఐలో బాండ్ల వేలం వేసే వరకూ… ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోయారు. రూ. రెండు వేల కోట్లు అలా అప్పు తీసుకుని జీతాలు సర్దేశారు. అయితే.. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు మాత్రం ఇవ్వలేదు. ప్రభుత్వానికి రోజువారీగా వచ్చే ఆదాయం.. ఇతర మార్గాల ద్వారా సమీకరిస్తున్న నిధులతో..పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. గురువారానికి ఇలా 70 శాతం మందికి ఇచ్చారు. మిగిలిన 30 శాతం మందికి ఇవ్వలేదు.

రిటైర్డ్ ఉద్యోగులు ఎక్కువగా తమ పెన్షన్ల మీదనే జీవనం సాగిస్తూంటారు. ఒక్క రోజు ఆలస్యమైనా వారికి ఇబ్బందే. అయితే ప్రభుత్వం మాత్రం.. అలాంటివేమీ పట్టించుకోవడం లేదు. తమ దగ్గర ఉన్నప్పుడు ఇస్తూ పోతోంది. పెన్షనర్లు ఈ విషయంపై ఆందోళన చెందుతూంటే.. ఉద్యోగ సంఘాల నేతలు.. పెన్షనర్ల సంఘాల నేతలు..ప్రభుత్వం తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడేందుకు పరుగులు పెడుతున్నారు. పెన్షన్లు ఇవ్వడానికి సాంకేతిక సమస్యలు వచ్చాయని… 70 శాతం మందికి పంపిణీ చేశారని.. మిగిలిన వారికి ఒకటి రెండు రోజుల్లో ఇస్తారని ప్రెస్‌నోట్‌లు రిలీజ్ చేస్తున్నారు . సాంకేతిక సమస్య వస్తే అందరికీ రావాలి కానీ.. కొంత మందికే ఎలా వస్తుందన్న సందేహం అందరికీ వస్తుంది.

ఏ ప్రభుత్వం ఉన్నా.. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లను.., ఒకటో తేదీన ఇవ్వడాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి. ఎందుకంటే.. అలా ఇవ్వకపోతే.. ఉద్యోగుల్లో అసంతృప్తి పెరిగిపోతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అందరిలోనూ అనుమానం ప్రారంభమవుతుంది. అయితే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. గత నెలలో ఎనిమిదో తేదీన అందాయి. ఈ నెల ఐదో తేదీ తర్వాత అందాయి. ఈ విషయంలో ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా వ్యవహరించకపోతే.. మరిన్ని చిక్కులు ఏర్పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close