మూడు రాజధానులు మేనిఫెస్టోలో పెట్టామంటున్న వైసీపీ ..!

ఎన్నికలకు ముందు అమరావతినే కొనసాగిస్తామని ఊరూవాడా ప్రచారం చేసి.. ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాజధానిని మూడు ముక్కులు చేస్తున్న వైనంపై వస్తున్న విమర్శలపై వైసీపీ .. తనదైన శైలిలో ఎదురుదాడి ప్రారంభించింది. తము.. మూడు రాజధానులను మేనిఫెస్టోలో పెట్టామంటూ.. కొత్త వాదన ప్రారంభించారు. మేనిఫెస్టోలో ఎక్కడ పెట్టారు అనే డౌట్ చాలా మందికి వస్తుంది… అందుకే.. వారే క్లారిటీ ఇచ్చారు. తాము బైబిల్‌గా భావించే మేనిఫెస్టోలో ఓ చోట.. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని ఉందట. దాని అర్థం.. మూడు రాజధానులేనని… చెబుతున్నారు. ముందుగా స్పీకర్ తమ్మినేని సీతారాంను రంగంలోకి దింపిన వైసీపీ నేతలు.. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ఈ సందేశాన్ని ప్రజలకు ఇచ్చారు.

చంద్రబాబునాయుడు రెండు రోజులకో సారి మీడియా సమావేశం పెట్టి.. గతంలో అమరావతి గురించి వైసీపీ నేతలు మాట్లాడిన మాటలను.. మీడియాలో ప్రదర్శిస్తున్నారు. మరో వైపు సోషల్ మీడియాలోనూ ఇవి హైలెట్ అవుతున్నాయి. దీంతో వైసీపీ నేతలపై ఒత్తిడి పెరుగుతోంది. మాట తప్పినందున మళ్లీ ప్రజాభిప్రాయం తీసుకోవాలని… డిమాండ్లు అన్ని విపక్ష పార్టీల నుంచి వస్తున్నాయి. అయితే దీనిపై వైసీపీ స్పందించడం లేదు. ఇప్పుడు మేనిఫెస్టోలో వికేంద్రీకరణ అనే పదం కనిపించడంతో.. దాంతోనే తమ విధానాన్ని డిఫెండ్ చేసుకోవాలని ముందుకు వస్తున్నారు. విచిత్రమైన లాజిక్‌తో రాజధాని తరలింపునకు కారణాలు చెబుతున్నారు.

అమరావతి తరలింపు వ్యవహారం.. వైసీపీకి పెద్ద చిక్కుగా మారింది. కోస్తా ప్రాంత ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ… జగన్ మాటను ఎవరూ జవదాటలేకపోతున్నారు. ఎన్నికలకు ఇంకా దాదాపుగా నాలుగేళ్ల సమయం ఉండటంతో.. వారంతా.. సైలెంట్‌గా ఉంటున్నారు. కొంత మందిని మాత్రం ఎదురుదాడికి వైసీపీ ఉపయోగించుకుంటోంది. ఈ క్రమంలో… మూడు రాజధానులను మేనిఫెస్టోలో పెట్టామంటూ.. కొత్త వాదనతో వైసీపీ రంగంలోకి దిగింది. వారికి ఉన్న సోషల్ మీడియా.. మీడియా బలంతో… జగన్ సహా.. వైసీపీ నేతలంతా చేసిన అమరావతి రాజధానిగా ఉంచుతామనే ప్రచారాన్ని తిప్పి కొట్టాలనే ప్రయత్నాలను చేస్తున్నారు. మరి ప్రజలను నమ్మించగలరో లేదో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close