మాజీ మంత్రి నారాయణ కు దిగువ కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసుల తరపున ఏఏజీ సుధాకర్ రెడ్డి చిత్తూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. పదోతరగతి ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయో.. మాల్ ప్రాక్టీసో తెలియదు కానీ.. ఒక్కో సందర్భంలో ఒకటి చెబుతూ వస్తున్న పోలీసులు ఇప్పుడు కూడా అదే గందరగోళంతో పై కోర్టులో బెయిల్ రద్దు కోసం పిటి,న్ దాఖలు చేశారు. అరెస్ట్ చేసిన నలుగురు నిందితులు ఒకే రకంగా ఇచ్చిన స్టేట్మెంట్లో నారాయణ పేరు చెప్పారని పదో తేదీన అరెస్టు చేశారు. తర్వాతి రోజు తెల్లవారు జాము కోర్టులో ప్రవేశ పెడితే బెయిల్ ఇచ్చారు.
అయితే వ్యవస్థల్ని మేనేజ్ చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాతి రోజు ఆరోపించి .. పైకోర్టుకెళ్లాలని నిర్ణయించామని ప్రకటించారు. అయితే ప్రభుత్వ ఏజీ.. ఇతర న్యాయవర్గాలతో సంప్రదింపులు జరిపి హైకోర్టు కన్నా.. చిత్తూరు జిల్లా కోర్టుకు వెళ్లడం మంచిదని ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పిటిషన్ వేశారు. అయితే వైసీపీ వ్యూహం ప్రకారం మొదటి నుంచి ఏ మాత్రం ఆధారాల్లేని కేసులు పెట్టడం కోర్టులు బెయిలిస్తే.. వ్యవస్థల్ని చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారని న్యాయవ్యవస్థ విశ్వసనీయతను ప్రశ్నించేలా ప్రచారం చేయడం కామన్గా మారింది.
ప్రశ్నాపత్రం వాట్సాప్లో ఎలా చేరిందో స్పష్టంగాగతంలో పోలీసులే చెప్పారు. అయినప్పటికీ. నారాయణ పాత్ర ఉందని నలుగురు ఉద్యోగులతో చెప్పించి అరెస్ట్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. న్యాయవ్యవస్థపై విశ్వసనీయత తగ్గించడానికే ఇలాంటి పనులు చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కోర్టుల్లో నిలబడవని తెలిసి కూడా పిటిషన్లు వేయడమే దీనికి సాక్ష్యమంటున్నారు.