బెయిల్ రద్దు పిటిషన్ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారన్న ప్రచారం కోసమే !?

మాజీ మంత్రి నారాయణ కు దిగువ కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసుల తరపున ఏఏజీ సుధాకర్ రెడ్డి చిత్తూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. పదోతరగతి ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయో.. మాల్ ప్రాక్టీసో తెలియదు కానీ.. ఒక్కో సందర్భంలో ఒకటి చెబుతూ వస్తున్న పోలీసులు ఇప్పుడు కూడా అదే గందరగోళంతో పై కోర్టులో బెయిల్ రద్దు కోసం పిటి,న్ దాఖలు చేశారు. అరెస్ట్ చేసిన నలుగురు నిందితులు ఒకే రకంగా ఇచ్చిన స్టేట్‌మెంట్లో నారాయణ పేరు చెప్పారని పదో తేదీన అరెస్టు చేశారు. తర్వాతి రోజు తెల్లవారు జాము కోర్టులో ప్రవేశ పెడితే బెయిల్ ఇచ్చారు.

అయితే వ్యవస్థల్ని మేనేజ్ చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాతి రోజు ఆరోపించి .. పైకోర్టుకెళ్లాలని నిర్ణయించామని ప్రకటించారు. అయితే ప్రభుత్వ ఏజీ.. ఇతర న్యాయవర్గాలతో సంప్రదింపులు జరిపి హైకోర్టు కన్నా.. చిత్తూరు జిల్లా కోర్టుకు వెళ్లడం మంచిదని ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పిటిషన్ వేశారు. అయితే వైసీపీ వ్యూహం ప్రకారం మొదటి నుంచి ఏ మాత్రం ఆధారాల్లేని కేసులు పెట్టడం కోర్టులు బెయిలిస్తే.. వ్యవస్థల్ని చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారని న్యాయవ్యవస్థ విశ్వసనీయతను ప్రశ్నించేలా ప్రచారం చేయడం కామన్‌గా మారింది.

ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో ఎలా చేరిందో స్పష్టంగాగతంలో పోలీసులే చెప్పారు. అయినప్పటికీ. నారాయణ పాత్ర ఉందని నలుగురు ఉద్యోగులతో చెప్పించి అరెస్ట్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. న్యాయవ్యవస్థపై విశ్వసనీయత తగ్గించడానికే ఇలాంటి పనులు చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కోర్టుల్లో నిలబడవని తెలిసి కూడా పిటిషన్లు వేయడమే దీనికి సాక్ష్యమంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close