రెండు బీసీ, అదానీ, రెడ్డి – మరి అలీకి చోటేది !?

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఏపీలో నాలుగు స్థానాలు వైసీపీ ఖాతాలో పడబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డికి రాజ్యసభ పదవీ కాలాన్ని పొడిగించాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే విజయసాయిరెడ్డికి కూడా క్లారిటీ వచ్చింది. విజయసాయిరెడ్డికికి పోగా మిగిలిన వాటిలో రెండు సీట్లను బీసీలకు కేటాయిస్తారని చెబుతున్నారు. ఒకటి పారిశ్రామికవేత్తల కోటాలో అదానీకి ఇవ్వబోతున్నారు.

రాజ్యసభ సీటు హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నా నెల్లూరు కు చెందిన టీడీపీ బీసీ నేత బీద మస్తాన్ రావు, కాంగ్రెస్ నుండి వైఎస్ఆర్‌సీపీలో చేరిన మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి లకు రాజ్య సభ సీట్లు దక్కకున్నట్టు చెబుతున్నారు. వీరిలో కిల్లి కృపారాణి ఉత్తరాంధ్ర కు చెందిన కళింగ సామాజిక వర్గానికి చెందిన నేత. అక్కడ మంత్రి పదవి..జిల్లా అధ్యక్ష పదవి రెండూ ధర్మాన సోదరులకే ఇవ్వడంతో కళింగ వర్గం అసంతృప్తిగా ఉంది. వారిని సముదాయించడానికి పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

మిగిలిన సీటు ను వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కుటుంబానికి కేటాయిస్తున్నారు. ఇటీవల సినీ నటుడు అలీకి రాజ్యసభ సీటు ఇస్తారన్న ప్రచారం జరిగింది. ఆయన సీఎం జగన్‌ను కూడా కలిశారు. రెండు వారాల్లో గుడ్ న్యూస్ చెబుతానని జగన్ కూడా ఆయనకు చెప్పారు. ఇప్పుడు పీఆర్సీలాగానే రెండు వారాలు ఎన్ని వారాలవుతుందో తెలియడం లేదు.. అలీకి మాత్రం గుడ్ న్యూస్ వినిపించడం లేదు. ఇక వినిపించదని తేలిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close