అమరావతి టాస్క్ తీసుకున్న జీవీఎల్ !

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు చాలా కాలం తర్వాత అమరావతిలో ప్రత్యక్ష పరిశీలనకు వెళతున్నారు. యూపీ ఎంపీ.. ఏపీ బీజేపీకి పెద్ద దిక్కుగా తనను తాను భావించుకుంటున్న జీవీఎల్ నరిసంహారావు నేతృత్వంలో ఈ పర్యటన సాగనుంది. అసలు అమరావతి మార్పును మొదటగా బీజేపీలో పరోక్షంగా స్వాగతించింది.. ఏపీ ప్రభుత్వం అలాంటి నిర్ణయం చేస్తోందని మొదటగా ప్రకటించింది జీవీఎల్ నరసింహారావే. రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ.. అదే పనిగా ప్రోత్సహించారు. నిజానికి ఆ నిర్ణయం గత ప్రభుత్వంలోనే అయిపోయిందని.. ప్రభుత్వం మారిన ప్రతీ సారి నిర్ణయాన్ని మార్చడం సరి కాదని ఆయన అప్పట్లో చెప్పి ఉంటే అసలు అమరావతి సమస్యే వచ్చేది కాదు.

కానీ జగన్ నిర్ణయాన్ని బీజేపీ ప్రోత్సాహించినట్లుగా ఆయన మాట్లాడారు. అయితే ప్రజాబిప్రాయం తెలుసు కాబట్టి పైకి మాత్రం తమ మద్దతు అమరావతికే అనిచెప్పడం ప్రారంభించారు. కానీ ఎప్పుడూ వారు రైతులకు ప్రత్యక్షంగా .. పరోక్షంగా అండగా నిలబడింది లేదు. పైగా విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలు అడ్డగోలుగా అమరావతి మహిళా రైతులపై మాట్లాడారు. ఇప్పుడు అమరావతిని కదిలించే అవకాశం లేకపోవడంతో ఇప్పుడు అమరావతిలో ఏం నిర్మాణాలు జరిగాయో పరిశీలిస్తమని బయలుదేరారు.

అమరావతి రైతులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం ప్రారంభిస్తే.. ఇక రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి పోవడానికి ఉండదని.. ఆ పని చేయాలని వేడుకుంటున్నా… ఏపీ బీజేపీ నేతలు ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదు. కానీ రాజకీయం కోసం మాత్రం అండగా ఉన్నామని చెప్పడానికి బయలుదేరి వస్తున్నారు. ఇప్పుడైనా అమరావతి నిర్మాణాలను చూసి చాలా కట్టాలని అనుకుంటారో ఎప్పట్లాగే గ్రాఫిక్స్ అంటారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close