చంద్రబాబు నివాసాన్ని స్వాధీనం చేసుకున్న ఏపీ సర్కార్..!

తెలుగుదేశం ప్రభుత్వానికి షాకుల మీద షాకులు ఇస్తున్నాయి.. అటు కేంద్రంలోని బీజేపీ.. ఇటు రాష్ట్రంలోని వైసీపీ. నలుగురు రాజ్యసభ సభ్యులను తీసుకుని… టీడీపీపీ విలీనం అంటూ… ఢిల్లీలో.. ఓ కార్యక్రమాన్ని పూర్తి చేసి.. చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. అది అలా ఉండగానే… ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం.. ప్రజావేదికను.. వైసీపీ సర్కార్ స్వాధీనం చేసుకుంది. అక్కడ.. ఉన్న తెలుగుదేశం పార్టీ సరంజామాను మొత్తం.. తీసుకెళ్లాలని.. సీఆర్డీఏ అధికారులు.. టీడీపీ నేతలకు సమాచారం ఇచ్చారు. ప్రజావేదికలో.. ఇరవై నాలుగో తేదీన కలెక్టర్ల మీటింగ్ పెట్టాలని కూడా నిర్ణయించారు.

ప్రభుత్వం చేతుల్లోకి ప్రజావేదిక..!

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. కరకట్ట పక్కన ఉన్న… లింగమనేని ఎస్టేట్స్‌కు చెందిన భవనంలో నివాసం ఉంటున్నారు. దానికి ఆయన అద్దె చెల్లిస్తున్నారు. ఆ తర్వాత … ముఖ్యమంత్రి నివాసం కోసం అన్నట్లుగా.. ఆ ఇంటికి అనుబంధంగా.. ప్రభుత్వ ఖర్చుతో… ప్రజావేదికను నిర్మించారు. అక్కడ్నుంచే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. అధికారిక కార్యక్రమాలను నిర్వహించారు. కలెక్టర్ల మీటింగ్‌లే కాదు.. పార్టీ వ్యవహారాలను కూడా నడిపారు. తన ప్రైవేటు నివాసానికి ఆనుకుని ఉన్నందునే.. దానిని ప్రతిపక్ష నేత నివాసంగా గుర్తిస్తూ.. కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ.. ఆ లేఖకు స్పందన రాలేదు. కానీ.. రియాక్షన్ మాత్రం… యాక్షన్‌లోకి వచ్చేసింది.

ప్రతిపక్ష నేత నివాసంగా గుర్తించాలన్న లేఖకు ఇదే రియాక్షన్..!

ప్రజావేదికను.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష నేత నివాసంగా గుర్తించడానికి ఏపీ సర్కార్ .. సిద్దపడదన్న చర్చ కొంత కాలం నుంచి నడుస్తోంది. చంద్రబాబు.. ఆ ప్రజావేదికను.. తన కోసం కేటాయించాలని లేఖ రాసినప్పుడే… వైసీపీ నేతలు.. దాన్ని.. ప్రభుత్వ కార్యకాలాపాలకే కేటాయించాలని… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద పిటిషన్లు పెట్టారు. అప్పుడే.. ప్రభుత్వ ఇంటెన్షన్ తేలిపోయింది. మధ్యలో విజయసాయిరెడ్డి కూడా పలుమార్లు ట్వీట్లు చేసి.. చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఇప్పుడు.. అధికారికంగా ప్రజావేదికను.. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

ప్రైవేటు భవనాన్ని కూడా.. కూలగొట్టడానికి ప్రణాళికలు..!?

ఇప్పుడు.. చంద్రబాబు ఉంటున్న ప్రైవేటు భవనంపై కూడా… వైసీపీ నేతలు కన్నేశారు. కొన్ని రోజులుగా.. ఆ ఇంటిని స్వాధీనం చేసుకుంటామని.. అవసరం అయితే.. కోర్టుకు వెళ్తామంటూ.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. ప్రభుత్వం కూడా అదే ఆలోచనలో ఉందన్న ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజులు పోతే.. చంద్రబాబును.. అమరావతిలో ప్రైవేటు నివాసంలో కూడా ఉండకుండా చేయబోతోంది. నిజానికి ప్రతిపక్ష నేతకు స్థాయికి తగ్గ నివాసాన్ని ప్రభుత్వం కల్పించాల్సి ఉంది. అలాంటిదేమీ లేకుండానే.. ప్రజావేదికను స్వాధీనం చేసుకున్నారు. ఉంటున్న ఇంటినీ కూడా.. కూలగొట్టడానికి ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close