మీడియా వాచ్ :  సాక్షికి ఫుల్ పేజీ యాడ్స్ కిక్..!

వైరస్ దెబ్బకు ఆదాయం లేక మనుగడ సమస్య ఎదుర్కొంటున్న న్యూస్ పేపర్ ఇండస్ట్రీలో సాక్షి సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ పత్రికకు దేశంలో ఇతర ఏ పత్రికకు లేనంత ఆదాయం కనిపించనుంది. జగన్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఎప్పుడూ పన్నెండు లేదా 14 పేజీల్లో వచ్చే పత్రిక.. ఇరవై మూడు పేజీల్లో వచ్చింది. అందులో.. 16 పేజీల వరకూ యాడ్స్. వాటిలో ఎనభై శాతం ఫుల్ పేజీ.. కలర్ యాడ్సే. ప్రస్తుతం ఉన్న యాడ్ రేట్ల ప్రకారం… చూస్తే.. ప్రభుత్వంలోకి.. ఔట్ సో్ర్సింగ్‌ ప్రకారం తీసుకున్న సాక్షి ఉద్యోగులకు కాకుండా.. ఇప్పుడు కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఆరు నెలల జీతాలకు సరిపోయేలా.. ప్రకటనలు వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు.

ఇప్పుడు ఓ ఫుల్ పేజీ ప్రకటన వస్తే.. పత్రికలు సంతోషపడిపోయే పరిస్థితి. కానీ.. సాక్షికి మాత్రం… అలాంటి ఇబ్బందే లేదు.. పేజీలకు పేజీలు యాడ్స్. ప్రభుత్వంలోని అన్ని శాఖలతో పాటు… ప్రభుత్వం దగ్గర పదవులు పొందినవారు.. ప్రభుత్వం దగ్గర కాంట్రాక్టులు పొందినవారు.. పార్టీ నేతలు.. కార్యకర్తలు.. ఇలా తమ శక్తివంచన లేకుండా ప్రకటనలతో సాక్షిని పోషించే ప్రయత్నం చేశారు. ఇంకా విశేషం ఏమింటే… ప్రభుత్వం కూడా.. ఈ ప్రకటన ఖర్చును భారీగా మోస్తోంది. అత్యధిక సర్క్యూలేషన్‌ ఉన్న ఈనాడు పత్రికకు.. ఒక్క ఫుల్ పేజీ యాడ్ ఇచ్చి.. మిగతా అంతా.. సాక్షి పత్రికకే మళ్లించుకుంటున్నారు.

రైతు  భరోసా కేంద్రాలు శనివారమే ప్రారంభమయ్యాయి. కానీ.. ఆదివారం మరో ఫుల్ పేజీ యాడ్ ఇచ్చారు. శనివారం ప్రారంభమయ్యాయని చెప్పడానికి ఆదివారం యాడ్ ఇచ్చారన్నమాట. ప్రజాధనం ఇలా ప్రకటనల రూపంలో పెద్ద ఎత్తున సాక్షి అకౌంట్‌కు చేరుతోందన్న విమర్శలు కొంత కాలం నుంచి వస్తున్నాయి. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close