కేంద్రం ఆదేశాలపై బిందాస్..! రివర్స్ టెండర్లకు నోటిఫికేషన్..!

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో.. రివర్స్ టెండరింగ్ కు వెళ్లే విషయంలో.. అనేక ప్రతిబంధకాలను పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ పదే పదే లేఖల రూపంలో వ్యక్తం చేస్తున్నా… ఏపీ సర్కార్ మాత్రం.. బిందాస్ అంటోంది. ఈ రోజు రివర్స్ టెండర్లు పిలుస్తారని చెప్పి.. రాత్రికి రాత్రే పీపీఏ.. ఓ సుదీర్ఘమైన లేఖను పంపింది. దాన్ని చెత్తబుట్టలో వేసేసిన ఏపీ సర్కార్.. రివర్స్ టెండర్లకు ఆహ్వానం పలికింది. పోలవరం హెడ్ వర్క్స్ లో మిగిలిపోయిన పనులు, హైడల్ ప్రాజెక్ట్ కు కలిపి ఒకే టెండర్ కు శాఖాధికారులు టెండర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. శనివారం ఎట్టి పరిస్థితుల్లోనూ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని అమెరికా వెళ్లకముందు సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. దాని ప్రకారమే… అధికారులు తమ బాధ్యత నిర్వర్తించారు.

పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ పై ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసి వీటిపై క్షుణ్ణంగా అధ్యయనం చేశాకే ఒక నిర్ణయానికి రావాలని సూచించింది. పోలవరం ప్రాజెక్ట్ కు రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం పెరగటమే కాకుండా జాప్యం కూడా జరుగుతుందని పీపీఏ అభిప్రాయపడింది. పీపీఏ సమావేశం తర్వాత అదే మాటలు చెప్పారు. రాత్రి రాసిన లేఖలోనూ అదే చెప్పారు. అయితే పీపీఏ అధ్యయనం చేయాలని కోరిందేగానీ టెండర్లు పిలవొద్దని చెప్పలేదని ప్రభుత్వం వాదిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మౌఖికంగా అనుమతి తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చిందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం పోలవరం హెడ్ వర్క్స్ లో మిగిలిపోయిన పనులు రూ. 1850 కోట్ల రూపాయలు, జల విద్యుత్ కేంద్రానికి 3 వేల 220 కోట్ల రూపాయలకు రివర్స్ టెండరింగ్ నోటిపికేషన్ జారీ చేశారు. ఈ రెండూ కలిపి రూ. 5 వేల 070 కోట్లు. వీటితోపాటు పోలవరం గేట్లను బేకం సంస్థ తయారు చేస్తోంది. గేట్లను తయారు చేసేందుకు 387.56 కోట్ల రూపాయలతో టెండర్ ను దక్కించుకుంది. అయితే ఈ పని నుంచి వైదొలగాలని ఇప్పటికే బేకం సంస్థకు పోలవరం ఎస్ఈ నోటీస్ లు జారీ చేశారు. వీటికి కూడా రివర్స్ టెండర్లను పిలువనున్నారు. రివర్స్ టెండరింగ్ డాక్యుమెంట్లను కేపీఎంజీ కన్సల్టెన్సీ సంస్థ ద్వారా ప్రభుత్వం తయారు చేయించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close