దేశంలోనే మొదటి ‘కంపెనీల’ రాజధాని!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో యాభైవేల ఎకరాల అటవీభూములను డీనోటిఫై చేసే విషయమై మరో 15 రోజుల్లో నిర్ణయాన్ని తెలియజేయగలమని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ శనివారం నాడు రాష్ట్రప్రభుత్వానికి తెలియజేసింది. రాజధాని నిర్మాణానికి (ఇపుడున్న 33 వేల ఎకరాల భూమికీ అదనంగా)50 వేల ఎకరాల అటవీ భూములు అవసరమని 2 నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.రాజధాని ప్రాంతంలో భూములను వాణిజ్యపరంగా విక్రయించే వ్యాపారాన్ని ప్రభుత్వమే చేస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో అధికారికంగానే అతిభారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారంచేసే తొలి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అవుతుంది.

రాజధాని ప్రాంతంలో లేఅవుట్‌ ప్లానింగ్‌ పూర్తి చేశాక, భూముల కేటాయింపులు అమ్మకాలూ ఉంటాయి. అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, దాని ద్వారా భూములను కేటాయిస్తారు. రాయితీల పాలసీ ఇక్కడ భూములు కొనే కంపెనీలకు వర్తిస్తుంది. రైతులకు ఇస్తామన్న భూములు వారికి కేటాయించాక, మిగులు భూముల్లో ఈ కేటాయింపులు ఉంటాయని ముఖ్యమంత్రి ఇప్పటికే వివరించారు. సమీకరించిన భూమిలో మిగిలే భూమితో పాటు, అటవీ భూములు డీనోటిఫికేషన్ ద్వారా వచ్చే మరో 50 వేల ఎకరాల్లోనూ ఇదే పద్ధతిని అమలు చేయనున్నారు. భూ విక్రయంతో లాభాలు ఆర్జించి సుందరమైన రాజధాని నగరాన్ని నిర్మిండమే ప్రభుత్వ ధ్యేయంగా ఉంది.

రాజధానికి తీసుకున్న భూములను అభివృద్ధి చేశాక ఆ ప్రాంతాన్ని జోన్లుగా విభజిస్తారు. ఆర్థిక, పర్యాటక, ఐటి, వినోద, వ్యాణిజ్యం మొదలైన రంగాల వారీగా ఈ జోన్లు వుంటాయి. ఆయా జోన్లలో పెట్టుబటులను టెండర్లు పిలిచి ఖరారు చేస్తారు. కంపెనీలకు జోన్ల వారీగా భూములు కేటాయించి నిర్వహణ కూడా ఆయా కంపెనీలకే అప్పజెప్పనున్నారు. షరతులకు లోబడి భూములు తీసుకున్నాక వారు వేరే వ్యక్తులకు కేటాయించినా తమకు ఇబ్బంది లేదని సింఎం చెబుతున్నారు. లాభాలు వచ్చే వీలుందనుకుంటే ప్రభుత్వమే కన్సార్టియంగా మారి ఆయా లావాదేవీల్లో భాగం పంచుకుంటుంది. న్యాయపరంగా చిక్కులు రాకుండా ఈ మేరకు కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ చట్టంలోనూ మార్పులూ తీసుకురానున్నారు. ప్రస్తుత ప్లానులో కంపెనీలకు వీలుగా ఎప్పుడు ఎక్కడ మార్పులు చేయాలనుకుంటే అక్కడ చేస్తారు.

ఇదంతా విశ్లేషించుకుంటే రాజధానిలో భాగస్వాములమవుతామని, ఉపాధి లభిస్తుందని ఆశపడి లాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చిన రైతుల ఆశలు ఎప్పటికీ నెరవేరవని స్పష్టమైపోతుంది. నిరంతరం కొససాగే ఇన్ క్లూజివ్ డెవలప్ మెంటులో మూల వనరులు ఇచ్చిన వారికి భాగస్వామ్యం అనే ఆదర్శం ఆచరణలోకి రాదని రాష్ట్రప్రభుత్వ ఆలోచనలే తేల్చి చెబుతున్నాయి. ప్రభుత్వం నుంచి వాణిజ్య సరళిలో షరతులు లేకుండా భూములుకొనే కంపెనీల మధ్యలో రైతులు తమకు కేటాయించే వెయ్యేసి గజాల స్ధలాల్ని నిలుపుకోగలరా? పక్కన వున్న కంపెనీ ఇచ్చేధరకు కాకుండా పోటీ పెట్టి కాస్త పెద్ద ధర రాబట్టుకుందామంటే మరో కంపెనీ ముందుకి వస్తుందా?? అసలు ఇది ప్రజా రాజధానే అవుతుందా???

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close