త్వరలో ఏపీ, తెలంగాణా రాష్ట్రాల గవర్నర్ మార్పు?

త్వరలో ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మార్పు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసుల వ్యవహారంలో అలాగే ఇరు రాష్ట్రాలకు సంబందించిన అనేక ఇతర సమస్యలు, వివాదాలలో అయన తీరుని తెదేపా మంత్రులు, నేతలు తీవ్రంగా నిరసించారు. ఆయన తెలంగాణా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. అలాగే తెరాస ప్రభుత్వం కూడా వివిధ కారణాల చేత ఆయనతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తోంది. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గవర్నర్ నరసింహన్ రాజకీయ పార్టీలు భవన్ లో ఏర్పాటు చేసిన ‘ఎట్ హోం’ విందుకు ఆంద్రప్రదేశ్, తెలంగాణా ముఖ్యమంత్రులు ఇరువురూ హాజరు కాకపోవడంతో ఆయన చాలా బాధపడ్డారు. ఇక తను పదవిలో కొనసాగలేనని కేంద్రప్రభుత్వానికి అప్పుడే ఆయన చెప్పినట్లు సమాచారం. ఆయన స్థానంలో ప్రస్తుతం కేరళ రాష్ట్రానికి గవర్నర్ గా వ్యవహరిస్తున్న సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివంను నియమించాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నట్లు తాజా సమాచారం. ఆయనకు రాష్ట్ర విభజన వలన ఎదురవుతున్న సమస్యలు, వివాదాలపై మంచి అవగాహన ఉంది. కనుక ఆయనైతే రెండు రాష్ట్రాలకు న్యాయం చేయగలరని కేంద్రప్రభుత్వం భావిస్తునట్లు తెలుస్తోంది. కానీ కేంద్రప్రభుత్వం దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ముందుగా ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదించిన తరువాతే తుది నిర్ణయం తీసుకోవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close