క్రిష్‌కు బోన‌స్ ఇస్తున్న బాల‌య్య‌?

ఎన్టీఆర్ బ‌యోపిక్ కు అన్ని ఏరియాల నుంచి సినిమాకు పాజిటివ్‌గా స్పంద‌న రావ‌డంతో చిత్ర బృందం విజ‌యోత్సాహంతో ఉంది. ఈ సినిమా స‌క్సెస్‌లో సింహ‌భాగం ద‌ర్శ‌కుడు క్రిష్‌దేన‌ని బాల‌కృష్ట చెబుతున్నార‌ట‌. దీంతో ఆయ‌న‌కు అద‌నంగా ఐదుకోట్ల పారితోషికాన్ని అందివ్వాల‌ని బాల‌కృష్ణ నిశ్చ‌యించున్నార‌ని తెలిసింది. ముందుగా రెండు భాగాల‌కు క‌లిపి క్రిష్‌కు ప‌దికోట్ల రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేశారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో క్రిష్ చూపించిన అంకిత‌భావం, ప్రణాళిబ‌ద్ద‌మైన ప‌నితీరు బాల‌య్య‌ను ఎంత‌గానో ఆక‌ట్ట‌కుంద‌ట‌. కేవ‌లం మూడునెల‌ల వ్య‌వ‌ధిలో రెండు భాగాల షూటింగ్‌ను పూర్తిచేశారు క్రిష్‌. సంక్రాంతి బ‌రిలో ఈ సినిమా సంతృప్తిక‌ర‌ర‌మైన ఫ‌లితాల్ని సాధిస్తుండ‌టంతో రెండో భాగం స‌క్సెస్‌పై ధీమాగా ఉన్నారు. ఈ విష‌యాల‌న్నింటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న బాల‌కృష్ణ రెండో భాగం విడుద‌ల‌కు ముందే క్రిష్‌కు బోన‌స్‌గా ఐదుకోట్ల రెమ్యున‌రేష‌న్‌ను అందించ‌బోతున్నార‌ని ఫిల్మ్‌న‌గ‌ర్‌లో వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తున్న‌ది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close