రోడ్డెక్కిన అనకొండ !

అది మంగళవారం (11-08-2015) ఉదయంపూట అనేకపనుల నిమిత్తం బెంగళూరువాసులు ఆ రోడ్డు ఎక్కారు. ఉన్నట్టుండి షాక్ కి గురై ఆగిపోయారు. ఒక భయంరమైన సర్పం ,అదికూడా అతిపెద్ద అనకొండ రోడ్డుమీద కనిపించింది. ఎంతటి ధైర్యస్థులైనాసరే గుండె ఆగిపోయేటంతటి భయంకరదృశ్యం అది. డ్రైనేజ్ గుంటలోనుంచి అప్పుడే పాక్కుంటూ బయటకువచ్చినట్టుంది ఈ అతిపెద్ద అనకొండ. తోకభాగం ఇంకా డ్రైనేజ్ గోతిలోనే ఉంది. నోరు భయంకరంగా తెరుచుకుని ఉంది. పైగా అప్పుడే మనిషిపై దాడిజరిపినట్టు దానినోట్లో మనిషి చెయ్యిలోని కొంతభాగం కనిపిస్తోంది. అక్కడంతా మనిషి తాలూకూ రక్తం మరకలు. ఇదీ సీను. అనకొండ మాత్రం ఏమాత్రం కదలకమెదలక అలాగే పడిఉంది. ఎందుకని?

ఎందుకంటే…

రోడ్డెక్కిన వాళ్లు ఈ అనకొండను చూడగానే విస్తుపోయారు. బెంగళూరు మనదేశపు ఐటీ రాజధానిగా గుర్తింపుపొందింది. అయినా అక్కడి రోడ్లు మాత్రం చెత్తాచెదారాలతో , పొంగిపొర్లుతున్న డ్రైన్లతో వానాకాలం వచ్చిందంటే చాలు, నరకం చూపిస్తుంటాయి. కొద్దిపాటి వానకే రోడ్లు కాలవులుగా మారిపోతుంటాయి. రోడ్లు మరమ్మతులు చేపట్టాల్సిన అధికారుల్లో చైతన్యం కలగడంలేదు. అందుకే `నమ్మ బెంగళూరు ఫౌండేషన్’ (ఎన్.బి.ఎఫ్) అనే స్వచ్ఛంద సంస్థ ఒక ఆలోచనచేసింది. లైవ్ సైజ్ లో అనకొండ బొమ్మను తీసుకొచ్చి అది నాలాలోనుంచి రోడ్డుమీదకు వచ్చి ఓ మనిషిని అప్పుడే పట్టి తినేసినట్టుగా భ్రాంతి కలిగేలా రద్దీగా జనం తిరిగే ప్రాంతంలో ఉంచారు. రోడ్లు బాగుచేయాడానికి సత్వరం కదలిరండి, లేకుంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని బెంగళూరు మహానగర పాలికకు తెలియజెప్పాలనే ఎన్.బి.ఎఫ్ ఈపని చేసింది.

anaconda1

బెంగళూరు రోడ్డుమీదకు క్రూరజంతువులు వచ్చేయడం ఇది కొత్తేమీకాదు. అంతకుముందు విజువల్ కళాకారుడు బాదల్ నంజుడస్వామి 12 అడుగుల పొడవున్న మొసలిరూపాన్ని ఉత్తర బెంగళూరులోని ఒక రోడ్డుమీద ఇలాగే పొంగిపొర్లుతున్న నాలానీటి మడుగువద్ద ఉంచాడు.

వానాకాలం నాలాలు పొంగడం ఒక్క బెంగళూరులోనేకాదు, హైదరాబాద్ లో కూడా ఇదే పరిస్థితి. జీహెచ్ఎంసీ ఎన్నిసార్లు రోడ్లు మరమ్మత్తులు చేసినా ఐదు సెంటీమీటర్ల వానపడితేచాలు, నాలాలు పొంగుతూనే ఉంటాయి. ఒక్కోసారి నాలాలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. అయినా పటిష్టమైన డ్రైనేజ్ వ్యవస్థ కలలోమాత్రమే ఊహించే పరిస్థితే ఉంది.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close