ఎన్డీఏలోకి వైసీపీకి ఆహ్వానం.. బీజేపీ ఆగ్రహం !

రాజకీయాలు చిత్రంగా ఉంటాయి. ఓ యాక్షన్‌కు రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఎన్డీఏ నుంచి ఎంతో మంది భాగస్వాములు వెళ్లిపోయినా రిపబ్లికన్ పార్టీ పేరుతో మహారాష్ట్రాలో రాజకీయాలు రామ్ దాస్ అథవాలే మాత్రం మోడీని అంటి పెట్టుకుని ఉన్నారు. ఆయన ఇప్పుడు ఇతర మిత్రుల్ని ఎన్డీఏలోకి తేవాలని అనుకుంటున్నారేమో కానీ రాష్ట్రాలు పర్యటించి.. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పార్టీలను ఎన్డీఏలో చేరాలని మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు. అలా ఏపీకి వచ్చి జగన్మోహన్ రెడ్డిని కూడా ఎన్డీఏలోకి ఆహ్వానించారు.

అథవాలే జగన్‌నే ఎందుకు ఆహ్వానించారు.. గతంలో ఎన్డీఏలో ఉన్న టీడీపీని ఎందుకు ఆహ్వానించలేదన్నది కొంత మందికి పజిల్‌గానే ఉంది. అయితే అథవాలే.. ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి.. బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు కాబట్టి అధికారికంగా ఎన్డీఏలోకి రావాలని ఆయన కోరి ఉంటారు. ఇప్పుడే కాదు గతంలోనూ ఆయనజగన్‌కు ఇలాంటి విజ్ఞప్తులు చేశారు. నిజానికి ఎన్డీఏలోకి జగన్‌ను ఆహ్వానించడం కానీ ఆ పార్టీ వచ్చి చేరిపోతుదంని చెప్పడం కానీ అంతా ఆయన వ్యక్తిగతం. ఎందుకంటే ఎన్డీఏ తరపున కేంద్రమంత్రి అథవాలేకు ప్రత్యేక బాధ్యతలు లేవు.

అయితే అథవాలే ప్రకటనపై వైసీపీ ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. స్పందిస్తే ఇంకా ఎక్కువ ప్రచారం జరుగుతుందని అనుకున్నారేమో కానీ సైలెంటయిపోయారు. అయితే బీజేపీ నాయకుడు లంకా దినకర్‌కు మాత్రం కోపం వచ్చింది. అథవాలేపై మండిపడ్డారు. అసలే ఏపీలో వైసీపీకి తోక పార్టీలా ఉందన్న విమర్శల నేపధ్యంలో అథవాలే వ్యాఖ్యలు తమపై మరింత ముద్ర వేస్తాయని ఆయన బాధపడి ఉంటారు. అయితే ఆయన ఒక్కరే స్పందించారు. ఇతర నేతలందరూ లైట్ తీసుకున్నారు.

అథవాలే ఎపీకి వచ్చి జగన్‌కు ఆహ్వానం అందించడం వెనుకరాజకీయం ఉందా లేకపోతే ..యాధృచ్చికంగానా అన్నది కొద్దిరోజుల్లో తేలే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుండే రాజకీయ పార్టీలు వ్యూహాలు మెరుగుపరుచుకుంటున్నాయి. ఈ క్రమంలో ఏమైనా జరగవచ్చన్నది కొందరి మాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close