అమిత్ షా టీంలో కనకమేడల… గడ్కరీ జట్టులో కేశినేని..!

తెలుగుదేశం పార్టీ ఎంపీలకు.. కేంద్ర పెద్దలు అనూహ్యంగా ప్రాముఖ్యత ఇస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నానిని.. రోడ్డురవాణా, షిప్పింగ్‌ మంత్రిత్వశాఖ కన్సల్టేటివ్‌ కమిటీ సభ్యుడిగా…నియమించారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. నితిన్ గడ్కరీతో… కేశినేని సన్నిహితంగా ఉంటారు. టీడీపీ హయాంలో.. నితిన్ గడ్కరీ సాయంతో.. విజయవాడకు అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాగపూర్ వెళ్లి అభినందించి వచ్చారు కూడా.అయితే వ్యక్తిగతంగా సన్నిహితుడయినంత మాత్రాన.. పదవి ఇచ్చే అవకాశం లేదు.

కేశినేని నానికి పదవి ఇవ్వడానికి ఒక్క రోజు ముందే.. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ కు.. కూడా.. కీలకమైన పదవి దక్కింది. ఆయన అమిత్ షా టీంలోనే చోటు దక్కించుకున్నారు. కేంద్ర హోంశాఖ సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఈ కమిటీలో టీడీపీ ఎంపీకి అవకాశం కల్పించడం ఎవరూ ఊహించనిది.

టీడీపీ, బీజేపీల మధ్య రాజకీయంగా సత్సంబంధాలు ఇటీవలి కాలంలో అంతగా లేవు. అయినప్పటికీ.. లోక్ సభ నుంచి కేశినేని నానికి.. రాజ్యసభ నుంచి… కనకమేడల రవీంద్రకుమార్ కు.. పదవులు ఇచ్చారు. సాధారణంగా.. ఎలాంటి కమిటీల్లో అయినా… అంతో ఇంతో… సఖ్యతగా ఉండే వారికే.. పదవులు ఇస్తూ ఉంటాయి.. ప్రభుత్వాలు. ఇప్పుడు.. టీడీపీ ఎంపీలకు.. అదీ కూడా.. రాజ్యసభలో ఇద్దరు.. లోక్‌సభలో ముగ్గురు మాత్రమే ఎంపీలు ఉన్నప్పటికీ.. బీజేపీ ప్రాధాన్యం కల్పిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో ఇదే హాట్ టాపిక్..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close