ఆలయాల విషయంలో జగన్ ని కాపాడబోయి బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి సెల్ఫ్ గోల్ ?

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ దేవాలయాల ధ్వంసం రాజకీయ రగడ ను సృష్టిస్తోంది. విజయనగరం రామతీర్థం లో ఆలయాల ధ్వంసాన్ని నిరసిస్తూ బిజెపి నేతలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. సమస్య రాజకీయ రంగు పులుముకోవడం తో ఇతర పార్టీల నేతలు కూడా రంగంలోకి దిగారు. తెలుగుదేశం నేతలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబు నాయుడు కూడా రామతీర్థం రానున్నాడు. వైఎస్ఆర్ సిపి నేతలు ర్యాలీలు నిర్వహిస్తూ చంద్రబాబే దీనికి కారణం అని బాబుపై నెపం నెట్టి వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. పైకి బిజెపి స్టాండ్ తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నా అంతర్గతంగా విష్ణువర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సిపి ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ ట్వీట్ చదివిన నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..

బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేస్తూ, “ఆలయాలు కూల్చడంలో మీకు మీరే సాటి
బాబు VS జగన్ . 5 జులై 2016 రోజు గుర్తు ఉందా @ncbn గారు? నాడు మీరు కూల్చింది.
బాబుగారు సియం గా40 ఆలయాలు.
జగన్ గారు సియం గా20 ఆలయాలు.
నేడు రామతీర్థ రామాలయానికి వెళ్ళేఅర్హత మీకు ఉందా బాబు గారు?రాజకీయాలకోసం రామాలయానికి వెళ్ళి ఆ ఆలయాన్ని అపవిత్రంచేయద్దు ” అని రాసుకొచ్చారు.

సెల్ఫ్ గోల్ 1: అప్పటి దేవాదాయ శాఖ మంత్రి బిజెపి నేత యే

అయితే విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ల పై నెటిజన్లు నవ్వుకుంటున్నారు. కారణం ఆయన చెప్పిన సమయం లో దేవాదాయ శాఖ మంత్రి గా ఉన్నది బిజెపి నేత మాణిక్యాల రావు. ఇంకొందరైతే ఆయనపై మండిపడుతూ చంద్రబాబు హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న మాణిక్యాలరావు బిజెపి నేత యే అని మర్చిపోయావా, లేక ప్రజలకు ఏమి గుర్తుండవు మనమేం చెప్పినా అదే నమ్ముతారు అన్న భ్రమలో ఉన్నావా విష్ణువర్ధన్ రెడ్డి అంటూ విమర్శలు చేశారు. మిడిమిడి జ్ఞానం తో ట్వీట్లు చేస్తే ఇలాగే ఉంటుంది అంటూ మరికొందరు చురకలంటించారు.

సెల్ఫ్ గోల్ 2: జగన్ ని కాపాడడానికే బాబు ని టార్గెట్ అంటూ విమర్శలు

అయితే విష్ణువర్ధన్ రెడ్డి గురించి గతంలో జనసైనికులు తవ్వి తీసిన సోషల్ మీడియా పురాణం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ దెబ్బకు కొంతకాలం పాటు మీడియా ముందు కనిపించకుండా విష్ణువర్ధన్ రెడ్డి , లో ప్రొఫైల్ మెయింటైన్ చేసిన సంగతి కూడా తెలిసిందే. మహిళల అంగాంగ వర్ణనలు, హీరోయిన్ సమీరా రెడ్డి పై, కులాభిమానం తోనో మరే కారణం చేతనో, ఆయన చేసిన వ్యాఖ్యలు, పైకి బిజెపి లో ఉన్నా తన సామాజిక వర్గానికి చెందిన పార్టీపై ఆయనకు విపరీతమైన అభిమానం ఉందని సూచించే పోస్ట్లు విష్ణువర్ధన్ రెడ్డి పై ప్రజలలో ఉన్న అభిప్రాయాన్ని కాస్త చులకన చేశాయి.

అయితే అధికార ప్రభుత్వం పై బిజెపి పార్టీ ఒక స్టాండ్ తీసుకుని పోరాడుతున్న సమయంలో, ప్రస్తుత అధికార పార్టీ కంటే గతంలోనే ఎక్కువ దాడులు జరిగాయని అర్థం వచ్చేలా విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ట్వీట్ కూడా ఇదే కోవలో, జగన్ ని కాపాడే ఉద్దేశంతో చేసిందా అన్న అనుమానాలు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. పైగా ఆ సమయంలో దేవాదాయ శాఖ మంత్రి గా ఉన్నది తమ పార్టీ నేత ఏ అని తెలిసి కూడా, ఇలాంటి ట్వీట్ చేస్తే అది తన పార్టీకి డ్యామేజ్ చేస్తుంది అని తెలిసి కూడా, విష్ణువర్ధన్ రెడ్డి జగన్ హయాంలో కంటే తమ పార్టీ నేత దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న టిడిపి హయాం లో ఎక్కువ దాడులు జరిగాయి అని ట్వీట్ చేయడం సెల్ఫ్ గోల్ గా మారింది. పైగా విష్ణువర్ధన్ రెడ్డి ఈ ట్వీట్ చేయగానే, జగన్కు మద్దతుగా నిలిచే కొన్ని అగ్ర చానల్స్ వీటిని ప్రముఖంగా స్క్రోలింగ్ ఇవ్వడం చూస్తుంటే, ఉద్దేశపూర్వకంగానే చాలా తెలివిగా విష్ణు వర్ధన్ రెడ్డి ఈ ట్వీట్ చేశాడేమో అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

మొత్తానికి విష్ణువర్ధన్ రెడ్డి, తాను బిజెపిలో ఉన్నప్పటికీ, తన స్టైలే సపరేటు అన్నట్లు వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డ‌బుల్ ఇస్మార్ట్‌: ఈసారి ‘చిప్‌’ ఎవ‌రిది?

పూరి జ‌గ‌న్నాథ్ రాసుకొన్న‌ డిఫరెంట్ క‌థ‌ల్లో 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఒక‌టి. హీరో మెద‌డులో చిప్ పెట్టి - దాని చుట్టూ కావ‌ల్సినంత యాక్ష‌న్, డ్రామా, వినోదం న‌డిపించేశారు. ఆ పాయింట్ కొత్త‌గా అనిపించింది....

ఉరవకొండ రివ్యూ : మరోసారి పయ్యావుల కేశవ్‌కే కిరీటం

ఉరవకొండలో పయ్యావుల గెలిస్తే టీడీపీ ఓడిపోతుందన్న ఓ ప్రచారాన్ని ఆయన ప్రత్యర్థులు చేస్తూ ఉంటారు. కానీ పయ్యావుల రాజకీయాల్లోకి వచ్చిన 1994లో టీడీపీ విజయం సాధించింది. పయ్యావుల కూడా గెలిచారు. ఆ తర్వతా...

చెల్లిని కించపర్చి జాతీయ మీడియాలో జగన్ నవ్వులపాలు

జాతీయ మీడియాకు జగన్ ఇచ్చిన ఇంటర్యూలు నవ్వుల పాలయ్యాయి. ఇతర విషయాల సంగతేమో కానీ చెల్లి షర్మిలపై ఆయన చేసిన వ్యాఖ్యలు బీహార్ లో పురుషాహంకారం ఉండే నేతలు కూడా...

పోస్టల్ బ్యాలెట్స్ కూడా రీపోలింగ్ – ఇదేం ఎన్నికల నిర్వహణ ?

ఎన్నికల నిర్వహణ ఎంత అసమర్థుల చేతుల్లో ఉందో తెలిపే ఘటన ఇది. పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట లో పోస్టల్ బ్యాలెట్లకు బదులు ఉద్యోగులకు డమ్మీ బ్యాలెట్లు ఇచ్చారు. రోజంతా ఉద్యోగులు కష్టపడి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close