కొత్త గవర్నర్‌తో ఏపీలో ఆరెస్సెస్‌కి పునాదులు..!?

ఆంధ్రప్రదేశ్‌పై బీజేపీ చాలా పెద్ద స్థాయిలో ఆశలు పెట్టుకుంది. అయితే.. ఆ పార్టీకి పునాది లాంటి ఆరెస్సెస్ కార్యకలాపాలు ఏపీలో చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఓ రకంగా.. అవి లేవనే చెప్పుకోవాలి. గతంలో ఉన్న కార్యకలాపాలు కూడా.. చాలా కాలంగా తగ్గిపోయాయి. ఆరెస్సెస్ సాయంతో భావజాలం వ్యాప్తి చేస్తేనే.. బీజేపీ సిద్ధాంతపరంగా మెరుగుపడుతుందనే భావనతో బీజేపీ ఉంది. నేతల చేరికలతో.. నాయకత్వం పరంగా బలపడినప్పటికీ.. కింది స్థాయిలో మాత్రం బీజేపీకి నిరాశ తప్పడం లేదు. ఈ లోటును పూడ్చటానికి ఆరెస్సెస్‌తో సుదీర్ఘ కాలం పయనించిన నేతను ఏపీకి గవర్నర్‌గా పంపినట్లు తెలుస్తోంది.

కేంద్రంలో రెండో సారి బీజేపీ అధికారంలోకి రాగానే .. టీడీపీపై గురి పెట్టింది. టీడీపీ నుంచి నలుగురు ఎంపీలు బీజేపీలో చేరడంతో కథ ప్రారంభించింది. సుజనాలాంటి నాయకులను ముందు పెట్టి కొంతవరకు కథ నడుపుతోంది. ఢిల్లీ నాయకులు తరుచుగా.. ఏపీలో పర్యటిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఏపీకి ప్రత్యేక గవర్నర్‌ నియామకం.. వ్యూహాత్మకంగా వేసిన ముందడుగు. ముందునుంచీ సంఘ్‌తో అనుబంధం ఉండి.. మోదీ, షా మార్క్ రాజకీయాలకు పర్‌ఫెక్ట్‌గా సూటయ్యే బిశ్వభూషణ్‌ను నియమించడం.. ఓ లెక్క ప్రకారమే జరగింది. మోదీ హయాంలో గవర్నర్లకు రాజకీయ ప్రాధాన్యం పెరిగింది. వారిచ్చే రిపోర్టులకే కాదు.. కీలక సమయాల్లో గవర్నర్‌ జోక్యం చేసుకోవడం.. ప్రభుత్వాలను సైతం ప్రభావితం చేసే రీతిలో గవర్నర్లు బలపడ్డారు.

ఓ వైపు పునాదుల్ని బలపరుచుకోవడమే కాదు… ఇతర పార్టీలను బలహీనం చేసే ప్రక్రియ కూడా ఉంది. చంద్రబాబు తరహాలోనే జగన్‌ కూడా అవినీతిని ప్రోత్సహిస్తున్నారని బీజేపీ నేతలు నెలన్నరలోనే ఆరోపణలు ప్రారంభించారు. పీపీఏల విషయంలో.. జగన్‌కు ప్రత్యేకంగా లేఖలు రాసింది. విద్యుత్‌ ఒప్పందాల సమీక్షలాంటి నిర్ణయాలు.. వద్దని చెప్పింది. అయినా.. జగన్‌ మాత్రం వెనక్కి తగ్గలేదు. దాంతో బీజేపీ నేతలిప్పుడు.. చంద్రబాబుకు పట్టినగతే జగన్‌కు పడుతుందని నేరుగా మాట్లాడుతున్నారు. ఓ రకంగా.. ఏపీలో బహుముఖంగా.. బీజేపీ తన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తోందని.. వీటన్నింటిని చూసి అర్థం చేసుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close