హరివంశ్ వర్సెస్ హరిప్రసాద్..‍‍! బీజేపీ గడ్డు పరిస్థితేనా..?

హరివంశ్ వర్సెస్ హరిప్రసాద్. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నది ఈ ఇద్దరే. హరివంశ్ జేడీయూ ఎంపీ. ఆయనకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. హరిప్రసాద్ కాంగ్రెస్ ఎంపీ, ఆయనకు కాంగ్రెస్, మిత్రపక్షాలతో పాటు కొన్ని తటస్థ పార్టీలు మద్దతు పలికాయి. విపక్ష పార్టీల తరపున అభ్యర్థిని నిలబెట్టేందుకు ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆసక్తి చూపించలేదు. కాంగ్రెస్‌ తన అభ్యర్థిని నిలబెడితే సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని హామీ ఇచ్చాయి. దీంతో ఆ పార్టీ హరిప్రసాద్‌ పేరును ఖరారుచేసింది. ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. మరోవైపు ఎన్డీయే అభ్యర్థిగా జేడీయూ ఎంపీ హరివంశ్‌ నారాయణ్‌ కూడా నామినేషన్ వేశారు.

బీకే హరిప్రసాద్‌ కర్ణాటకకు చెందిన వారు. గురువారం ఉదయం 11 గంటలకు ఎన్నిక జరగనుంది. సంప్రదాయం ప్రకారం.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని విపక్షాలకు ఇవ్వాలి. కానీ బీజేపీ మాత్రం తమ కూటమి చేతుల్లోనే ఉండాలని నిర్ణయించుకుంది . పూర్తి మెజార్టీ లేకపోయినా పోటీకి సిద్దమయింది. ప్రస్తుతం
రాజ్యసభలో 244 మంది సభ్యులున్నారు. ఈ ఎన్నికలో మెజార్టీ సాధించాలంటే 123 ఓట్లు అవసరం. ముగ్గురేసి సభ్యులున్న శివసేన, అకాలీదళ్, తొమ్మిది మంది సభ్యులు ఉన్న బీజేడీ ఓటింగ్‌కు గైర్హాజరవుతారన్న ప్రచారం జరుగుతంది. వీరు ఓటింగ్ కు రాకపోతే… గెలుపునకు కావాల్సిన మ్యాజిక్ ఫిగల్ 115కు తగ్గుతుంది.

అకాలీదళ్, శివసేనను లెక్క నుంచి తీసేస్తే.. ఎన్డీఏ బలం 110 మాత్రమే అవుతుంది. వైసీపీ బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేస్తామని ప్రకటించింది. టీడీపీ ఇప్పటికే బీకే హరి ప్రసాద్ కు మద్దతు ప్రకటించింది. ఈ రెండు పార్టీలతో కలుపుకుని తమకు 119 మంది సభ్యుల బలం ఉందని కాంగ్రెస్ చెబుతోంది. అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌, మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ, డీఎంకే కూడా కాంగ్రెస్ అభ్యర్థికే ఓటు వేయనున్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే బీజేపీకి గడ్డు పరిస్థితే ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close