బీజేపీ గవర్నరేగా సంతకం పెట్టింది..! ఎలా స్వాగతిస్తున్నారు..?

ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్‌ను తొలగిస్తూ.. తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ చెల్లదని..హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ నేతలు కూడా.. పోటీలు పడి స్వాగతించారు. ఢిల్లీలో జీవీఎల్ నరసింహారావు దగ్గర నుంచి అనంతపురంలోని విష్ణువర్ధన్ రెడ్డి వరకూ అందరూ ప్రభుత్వానికి చెంపపెట్టు అనే విమర్శు చేశారు. అంత వరకూ బాగానే ఉంది. కానీ ఈ అత్యంత వివాదాస్పద నిర్ణయం.. ఏపీ సర్కార్ తీసుకోవడానికి వెనుక ఉన్నది బీజేపీ దన్నేనని చాలా మంది అనుమానం. ఎన్నికల సంఘం అధికార పరిధుల్లోకి ప్రభుత్వాలు చొచ్చుకురాకుండా… రాజ్యాంగపరమైన రక్షణ ఉంది. ఆ విషయంలో తిరుగులేని తీర్పులు ఉన్నాయి.

అయినప్పటికీ.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. తన వద్దకు ఫైల్ వచ్చిన గంటల‌్లోనే క్లియర్ చేశారు. అత్యంత రహస్యంగా జరిగినప్రక్రియకు తన వంతు సాయం చేశారు. ఆర్డినెన్స్‌కు మాత్రమే కాదు.. ఎస్‌ఈసీ నియామకానికి కూడా ఆయన శరవేగంగా ఆమోదం తెలిపారు. ఆయన సంతకాలు పెట్టిన విషయం.. మొత్తం వ్యవహారం బయటకు వచ్చిన తర్వాతనే తెలిసింది. ఆ వేగం.. ఆ సీక్రెసీని బట్టి చూస్తే.. ఢిల్లీ అండ ఉంటేనే ఏపీ సర్కార్ ఇంత సాహసం చేస్తుందని ఎవరైనా నమ్ముతారు. అందుకే.. గవర్నర్ హరిచందన్ కూడా.. కళ్లు మూసుకుని సంతకాలు పెట్టారని భావించారు.

కానీ ఇప్పుడు హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా రాగానే బీజేపీ నేతలు.. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేశారు. ఇదే డబుల్ గేమ్ ఏమో అన్న చర్చ.. ఇప్పుడు ప్రారంభమయింది. ఏపీ సర్కార్ చేస్తున్న ప్రతీ ప్రయత్నానికి బీజేపీ మద్దతు ఉందన్న అంచనాలు ఉన్నాయి. ప్రజలు కూడా అదే భావనలో ఉన్నారు. చట్ట, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలను.. ఢిల్లీ స్థాయిలో అడ్డుకునే అవకాశం ఉన్నప్పటికీ కోర్టుల్లో వీగిపోయిన తర్వాతనే.. తాము వాటిని వ్యతిరేకించినట్లుగా ప్రకటనలు చేయడం.. రాజకీయంలో భాగం ఏమో అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close