అశోక్ గజపతిరాజు తల్లిదండ్రులపెంపకం అదేనా !? : బొత్స

టీడీపీ నేత అశోక్ గజపతిరాజు కుటుంబీకులను వారి తల్లిదండ్రులను కూడా అవమానించడానికి వైసీపీ నేతలు ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. రామతీర్థం ఆలయం వద్ద ఆయనను ఘోరంగా అవమానించడమే కాకుండా.. తప్పు ఆయనదేనంటూ రెండు కేసులు కూడా పెట్టించిన ప్రభుత్వ పెద్దలుఇప్పుడు అత్యంత దారుణంగా తిట్లను అందుకుంటున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ.. ఇదేనా ఆయన సంస్కారం, ఆయన తల్లిదండ్రుల పెంపకం ఇదేనా చెలరేగిపోయారు.

విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన… విజయనగరం రాజులను అత్యంత దారుణంగాకించపరిచారు. అశోక్ గజపతిరాజు తప్పు చేసి.. తమపై నిందలువేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం మాకెందుకు ఉంటుందని అమాయకత్వం ఒలకబోశారు. ధర్మకర్తగా ఆలయ అభివృద్ధి కి ఆయన ఎప్పుడైనా సహకరించారా అి ప్రశఅనించారు. అశోక్ గజపతిరాజు ఇచ్చిన విరాళాన్ని వెనక్కి ఇవ్వడాన్ని కూడా బొత్స సమర్థించారు.

విగ్రహాల కోసం లక్ష ఇచ్చి దానికి కూడా కండిషన్ పెట్టాడని.. టిటిడి విగ్రహాలు ఉచితంగా ఇచ్చింది కాబట్టే వెనక్కి పంపామని సమర్థించుకున్నారు. అశోక్ గజపతిరాజు సంస్కారం గురించి.. ఆయన పెంపకం గురించి బొత్స మాట్లాడిన మాటలు కలకలంరేపుతున్నాయి. ఇంట్లోని భార్యల్ని, తల్లిదండ్రుల్ని కూడా వైసీపీ నేతలు ఇలా అవమానించడం ఏమిటన్న చర్చ జరుగుతోంది. టీడీపీ నేతల్ని మానసికంగా వేధించేందుకు కుటుంబసభ్యుల్ని అగౌరవ పరుస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

‘స్వ‌యంభూ’ యాక్ష‌న్‌: 12 రోజులు… రూ.8 కోట్లు

'కార్తికేయ 2'తో నిఖిల్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇది వ‌ర‌కు రూ.8 కోట్లుంటే నిఖిల్ తో సినిమా చేసేయొచ్చు. ఇప్పుడు ఓ యాక్ష‌న్ సీన్...

నాని సైతం.. ప‌వ‌న్ కోసం

ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి ప‌దేళ్ల‌య్యింది. మెగా ఫ్యామిలీ, కొంత‌మంది క‌మెడియ‌న్లు, ఒక‌రిద్ద‌రు ప‌వ‌న్ డై హార్డ్ ఫ్యాన్స్ త‌ప్ప‌, ప‌వ‌న్‌కు నేరుగా పొలిటిక‌ల్ గా స‌పోర్ట్ ఎవ‌రూ చేయ‌లేదు. దానికి...

కేసీఆర్‌కు ధరణి – జగన్‌కు టైటిలింగ్ యాక్ట్ !

తెలంగాణలో కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు.. అంటే ప్రధాన కారణాల్లో ధరణి అని ఒకటి వినిపిస్తుంది. ఈ చట్టం వల్ల కేసీఆర్ , బీఆర్ఎస్ నేతలు భూములు దోచుకున్నారన్న ఓ ప్రచారం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close