“స్టీల్‌ ప్లాంట్” పై వైసీపీని పవన్ ప్రశ్నిస్తే సోము వీర్రాజుకు కోపం ఎందుకు !?

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సోము వీర్రాజు అనవసరంగా ఆవేశపడుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై పవన్ కల్యాణ్ ఉద్యమం చేస్తున్నారు. అయితే ఆయన ఎక్కడా కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నారు. ఎంపీలు కనీసం పార్లమెంట్‌లో ప్లకార్డులు పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో వైసీపీ నేతలకు బాగా నొప్పి పుట్టింది. పవన్ ను చెడామడా తిట్టేశారు. అయితే ఇప్పుడు బీజేపీ నేతలు ముఖ్యంగా ప్రో వైసీపీ నేతలకు కూడా ఈ విషయంలో నొప్పి కలుగుతోంది.

వారు కూడా మిత్రపక్షం అయిన జనసేనను ప్రశ్నిస్తూ..పవన్ కల్యాణ్‌ను నిలదీస్తూ మీడియా ముందుకు వస్తున్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు..పవన్ కల్యాణ్ ఒక్క స్టీల్ ప్లాంట్ అంశంపైనే మాట్లాడటం సరి కాదని.. ప్రస్తుత..గత ప్రభుత్వాలు అమ్మేసిన సంస్థలగురించి కూడా మాట్లాడాలని డిమాండ్ చేసినట్లుగా మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ఒక్కటే కనిపిస్తోందా అని ప్రశ్నించారు. సోము వీర్రాజు సందర్భం లేకపోయినా పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించడం జనసేన వర్గాలను సైతం నివ్వెరపరిచింది.

అసలు కేంద్రాన్ని.. బీజేపీని పవన్ ఎక్కడా ఓ మాట అనకపోయినా… ఆ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ… భరిస్తున్నా… అదేమి పట్టించుకోకుండా సోము వీర్రాజు విమర్శలు చేయడం జనసేన నేతల్లో చర్చకు కారణం అవుతోంది. ఇతర బీజేపీ నేతలు కూడా స్పందిస్తే..బీజేపీ పవన్ విషయంలో ప్రత్యేకమైన ఎజెండా తో వెళ్తోందన్న అభిప్రాయానికి రావొచ్చని భావిస్తున్నారు. సోము వీర్రాజు.. పవన్ ను ప్రశ్నించడం ద్వారా రెండు పార్టీల మధ్య ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న పరిస్థితి ఉందన్న అభిప్రాయం కల్పించారు. ఇది తఏ వైపు వెళ్తుందో వేచి చూడాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెరపైకి క్రికెటర్ క్యారెక్టరైజేషన్

ఫాస్ట్ బౌలర్ లక్ష్మీపతి బాలాజీ గుర్తున్నాడా? మెరుపు వేగంతో బంతులు వేసే బాలాజీ ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తాడు. ఆయన సీరియస్ గా కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. దాదాపుగా ఆయన స్మైల్ ఫేస్...

పట్టభద్రుల బైపోల్..ప్రధాన పార్టీలకు స్వతంత్ర అభ్యర్థుల బెడద..?

లోక్ సభ ఎన్నికలు ముగియడంతో తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికపైనే నెలకొంది. ఈ నెల 27న ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల స్థానానికి బైపోల్ జరగనున్న నేపథ్యంలో ఈ...

‘పుష్ష‌’పై ఫ‌హ‌ద్‌కు ఇంత చిన్న చూపా?

'పుష్ష' టీమ్ ని ఫ‌హ‌ద్ ఫాజ‌ల్ బాగా ఇబ్బంది పెడుతున్నాడు. త‌న డేట్లు ఇస్తే కానీ 'పుష్ష 2' షూటింగ్ పూర్త‌వ్వ‌దు. ఆయ‌నేమో డేట్లు ఇవ్వ‌డం లేదు. ఇది వ‌ర‌కే ఫ‌హ‌ద్ గంప‌గుత్త‌గా...

మెగా ఫ్యామిలీలో రచ్చ…అల్లు అర్జున్ పై నాగబాబు సీరియస్..!?

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారం చేయడంపై ఇంకా తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే ఆయన పర్యటన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close