జగన్ అనుకున్నదొకటి..! బొత్స చేసిందొకటి..!

రాజధాని నిర్మాణాలను కొనసాగించాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడం..భూములిచ్చిన రైతుల్లో ఆనందానికి కారణం అయింది. ఇది ప్రభుత్వంపై పాజిటివ్ అభిప్రాయం ఏర్పడటానికి ఆస్కారం ఏర్పరిచింది. అయితే.. ఈ పాజిటివ్ వేవ్ ని.. బొత్స ఒక్క మాటతో… పాతాళానికి పంపేశారు. అమరావతిని శ్మశానంతో పోల్చడంతో.. రైతులు విరుచుకుపడ్డారు. బొత్స తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. తమను రైతులుగా చూడాలని.. పార్టీలు, వర్గాల వారీగా కాదన్నారు. తాము భవిష్యత్ తరాల కోసం భూములను త్యాగం చేశామని స్పష్టం చేసారు. రాజధానిని స్మశానంగా అభివర్ణించడం ఏమిటని, ఆ స్మశానంలోనే సచివాలయం, అసెంబ్లీ, ఉందని అక్కడే కూర్చుంటున్నారనే విషయం మరచిపోవద్దని రైతులు గుర్తు చేశారు.

తాను చేసిన శ్మశానం వ్యాఖ్యలు తీవ్ర వివాదం అవడంతో.. బొత్స సత్యనారాయణ వివరణ ఇచ్చారు. రాజధాని ఏమి చూసేందుకు వస్తావని మాత్రమే తాను అడిగానని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజధాని అమరావతిలో నిర్మాణాలను పూర్తిగా నిలిపివేసింది. రైతులకు కౌలు ఇవ్వడం మినహా ఇంకెలాంటి ముందడుగు వేయలేదు. రాజధాని, రాష్ట్రంలోని మిగతా నగర, పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసమంటూ ఒక కమిటీని కూడా నియమించింది. రాష్ట్ర హైకోర్టును కర్నూలుకు మార్చాలని కొందరు, ఇక్కడే ఉంచాలని మరికొందరు ఉద్యమాలు చేశారు. హైకోర్టు ను రాయలసీమకు మార్చే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందని ఓ మంత్రి చేసిన ప్రకటనతో ఉద్యమం మరింత ఊపందుకుంది.

రాజధాని రైతాంగంలో కూడా అలజడి ప్రారంభమైంది. రాజధానిని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని నిర్ణయానికి వచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే డిసెంబర్ తొమ్మిదో తేదీ నుంచి తమకు మంజూరు చేసిన ప్లాట్లలో దీక్షలకు దిగుతామని రైతులు హెచ్చరించారు. ఈ పరిస్థితుల మధ్య..చంద్రబాబునాయుడు ఈనెల 28వ తేదీన రాజధాని పర్యటనకు వెళ్తున్నారు. ముందు ముందు రాజధాని రాజకీయం మరింత సెగలు రేపే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close