క్రైమ్‌: పెళ్లి కూతుర్ని మార్చేశారని ప్రాణం తీసుకున్న నవవరుడు..!

పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూసుకున్నాడు. తనకు నచ్చింది. పెళ్లికి ఒప్పుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. కానీ మొదటి రాత్రి గతిలో అమ్మాయి మొహం చూసి మూర్చపోతాడు. తేరుకున్న తర్వాత ఆగ్రహంతో రగిలిపోతాడు. ఇలాంటి సీన్లు సినిమాల్లో చాలా ఉంటాయి. కానీ నిజజీవితంలో జరిగితే..? ఆ పెళ్లికొడుకు పూర్తిగా హర్ట్ అయి ఉంటే ఏం జరుగుతుంది..?. ప్రాణాలు తీసుకుంటాడు. విజయనగరంలో అదే జరిగింది.

విజయనగరంలో నివాసం ఉండే మదీనా అనే ముస్లిం యువకుడి పెళ్లి నాలుగు రోజుల కిందట ఘనంగా జరిగింది. కానీ పెళ్లయిన రెండు రోజులకే.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు అంటే.. తను పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయి.. పెళ్లి చేసుకున్న అమ్మాయి ఒక్కటి కాదని.. తెలిసినందుకు. ముస్లిం సంప్రదాయం ప్రకారం.. పెళ్లిలో అమ్మాయి మొహాన్ని చూడనివ్వరు. ముఖం కనిపించకుండా పువ్వులతో అలకరిస్తారు. పెళ్లి జరిగే వరకు పెళ్లి కుమార్తెను రెండో కంటపడకుండా పెళ్లికుమార్తె బంధువులు తమ ఆచారాలను పాటిస్తారు.ఆ ప్రకారమే నిఖా జరిగింది. కానీ అమ్మాయి మొహంపై మొత్తం పులిపిర్లు ఉన్నాయి. చూడటానికి కాస్తంత భయంకరంగా ఉంది. తాను పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయి కాదని.. . పెళ్లి చూపుల్లో ఒక అమ్మాయిని చూపించి…మరో అమ్మాయిని తీసుకొచ్చి తనతో నిఖా జరిపించారని స్నేహితుల వద్ద… మదీనా మథనపడ్డాడు. ఆ క్షోభతోనే ప్రాణాలు తీసుకున్నాడు.

ఈ విషయం విజయనగరం జిల్లాలో సంచనలం సృష్టించింది. రెండు కుటుంబాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. తాము పెళ్లి చూపుల్లో ఎవర్ని చూపించామో.. వారితోనే పెళ్లి చేశామని పెళ్లికుమార్తె కుటుంబసభ్యులు చెబుతున్నారు. మృతుని తల్లిదండ్రులు మాత్రం నైరాశ్యంలో మునిగిపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close