రూపాయి పతనంపై ఆందోళన వద్దట..! జైట్లీ సొమ్మేం పోతోంది..!?

డాలర్‌తో పోలిస్తే.. రూపాయి విలువ అత్యంత దారుణంగా పడిపోతోంది. మూడు పైసలు తక్కువగా రూ. 72కి చేరుకుంది. ఇంత వేగంగా.. ఇంత దారుణంగా.. రూపాయి పడిపోతుందని.. ఎవరూ ఊహించలేదు. నాలుగైళ్ల కిందట.. రూ. 55 – రూ. 60 మధ్య ఊగిసలాడుతున్న డాలర్‌ను చూపించి… అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్న మోడీ.. చాలా వెటకారపు ట్వీట్లు చేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలాగే… రూపాయి చాలా బలహీనంగా ఉందని… సెటైర్లేశారు. రూపాయిని బలపరచడానికి కేంద్రం వద్ద బలం లేదని విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు దేశాన్ని భయపెట్టే స్థాయిలో రూపాయి విలువ పడిపోతోంది. ఇప్పుడు అధికారంలో ఉన్న మోడీ ఏం చేస్తున్నారు. ఆయన ఆర్థిక మంత్రి ఏం చేస్తున్నారు..? రూపాయి పతనాన్ని మార్కెట్‌కు వదిలేయండి..! భయపడాల్సింది.. కంగారు పడాల్సింది ఏమీ లేదని… చాలా తాపీగా సెలవిస్తున్నారు. ఇప్పుడే కాదు.. ముందు ముందు పతనమైన పట్టించుకోమని ముందస్తుగా చెప్పేస్తున్నారు.

గతంలో సంగతేమో కానీ.. ఇప్పుడు రూపాయి పతనం అయితే.. దేశప్రజలపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది. దేశీయంగా కూడా నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం చాలా తీవ్రంగా ఉంటోంది. మన పెట్రోలియం ఉత్పత్తులు 80 శాతం దిగుమతులే. రూపాయి పతనం అవ్వడం వల్ల.. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయి. ఇవి రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. వీటి ధరలు పెరిగితే ఆటోమేటిక్ గా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. చమురు దిగుమతులకు మనం డాలర్లలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఓ వైపు విదేశీ పెట్టుబడులు వెనక్కి పోయి డాలర్లు తగ్గిపోతున్నాయి. మరో వైపు చమురు ధరలు పెరిగి డాలర్లలో ఎక్కువ చెల్లింపులు చేయాల్సి వస్తోంది. రూపాయి పతనం వల్ల కూడా డాలర్లు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్యవస్థలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. చమురు ధర పది డాలర్లు పెరిగితే.. 0.6 శాతం జీడీపీ తగ్గిపోతుంది. అంటే చమురు ధరలు పెరిగితే.. దేశ స్థూల జాతీయోత్పత్తి కూడా తగ్గుతుంది. కానీ ఆర్థిక మంత్రిగా ఇదేేమంత పెద్ద విషయంగా అనిపించడం లేదు.

2013లో దాదాపుగా ఇలానే రూపాయి దారుణంగా పతనం అవుతున్నప్పుడు ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న రఘురాం రాజన్.. చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేసి పతనాన్ని అడ్డుకున్నారు. బంగారం దిగుమతులపై ఆంక్షలు విధించారు. పెట్టుబడులు తిరిగి పోకుండా.. అనేక నియంత్రణలు పెట్టారు. ప్రవాస భారతీయులు డాలర్లు తీసుకొచ్చి.. దేశంలో పెట్టుబడులుగా పెట్టడాన్ని ప్రొత్సహించారు. అలాంటి చర్యల వల్ల రూపాయి కొంత బలపడింది. కానీ ఇప్పటి ప్రభుత్వం .. పదవి విరమణ చేసిన రాజన్‌ను సైతం తప్పు పడుతోంది. చిన్నతరహా పరిశ్రమలు అంపశయ్యపై ఉండటానికి నోట్ల రద్దు కారణమని ఆర్థిక శాస్త్రవేత్తలందరూ చెబుతూంటే… ప్రభుత్వ పెద్దలు, వారి వందిమాగధులు.. రఘురాం రాజన్ వల్లేనంటూ నిందలేస్తున్నారు. ఏలా చూసినా… కేంద్ర ప్రభుత్వం అత్యంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహిస్తోంది. ఏ ప్రయోజనాల కోసం చూస్తుందో..మరి…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత..?

తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేసిన బీజేపీ ప్రచారంలో వెనకబడిన అభ్యర్థులను మార్చాలని నిర్ణయం తీసుకోనుందా..? సర్వేలతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థిని మార్చనుందా..?...

మూడు రోజులు బయటకు రాకండి… వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. రానున్న మరో మూడు రోజులపాటు 3 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ...

నా కొడుకును ఉరి తీయండి… మాజీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ‌లోనే సంచ‌ల‌నం సృష్టిస్తున్న బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు హిట్ అండ్ ర‌న్ కేసుల‌పై ష‌కీల్ స్పందించారు. ఓ కేసులో బెయిల్ రాగానే మ‌రో కేసు తెర‌పైకి తీసుక‌రావ‌టం వెనుక...

HOT NEWS

css.php
[X] Close
[X] Close