వైసీపీ గెలుపును గట్టిగా కోరుకుంటున్న బీఆర్ఎస్..!?

తెలంగాణలో మళ్లీ బలపడాలంటే ఏపీలో వైసీపీ గెలవాలని బీఆర్ఎస్ గట్టిగా కోరుకుంటోంది. కూటమి గెలిస్తే బీఆర్ఎస్ అస్తిత్వం కనుమరుగు అవుతుందని గులాబీ నేతలు గుసగులాడుకుంటున్నారు. వైసీపీ గెలిస్తే ఎలాగూ తెలంగాణతో నీటి వాటాల విషయంలో వివాదం తలెత్తుతుందని..దానిని అడ్వాంటేజ్ గా తీసుకొని మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను రగల్చవచ్చుననేది బీఆర్ఎస్ ధీమా. అలా మళ్లీ రాష్ట్రంలో మునుపటిలా ఆదరణ పొందవచ్చునని లెక్కలు వేసుకుంటోంది.

చంద్రబాబు సారధ్యంలోని కూటమి గెలిస్తే సీఎం రేవంత్ రెడ్డి నీటి, విద్యుత్ పంపకాల్లో ఎలాంటి వివాదాలు లేకుండా పరిష్కరించుకోగలరు. చంద్రబాబు – రేవంత్ రెడ్డిల మధ్య సాన్నిహిత్యం ఉండటంతో ఇద్దరిలో ఎవరూ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వివాదాలకు వెళ్ళరని, సానుకూల వాతావరణంలో చర్చలతోనే సమస్యలను పరిష్కరించుకుంటారని బీఆర్ఎస్ లో అంతర్గతంగా సాగుతోన్న చర్చ. అదే జరిగితే సెంటిమెంట్ ను తెరమీదకు తీసుకురావడం బీఆర్ఎస్ కు కష్టమే.

వీటన్నింటిని అంచనా వేసిన బీఆర్ఎస్ ఏపీలో జగన్ రెడ్డి గెలవాలని కోరుకుంటోంది.రేవంత్ రెడ్డితో సన్నిహితంగా మెదిలేందుకు ఎలాగూ జగన్ ఆసక్తి కూడా చూపరని తద్వారా ఇరు రాష్ట్రాల మధ్య జల జగడాలు ఖాయమని అది బీఆర్ఎస్ ఉనికికి జీవం పోసినట్లేనని విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. అదే సమయంలో జగన్ కు 2019 ఎన్నికల్లో ఫండింగ్ చేయడంతో.. ఏపీలో మళ్లీ గెలిస్తే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కు జగన్ అండగా ఉంటారని గులాబీ దళం నమ్ముతోంది.

ఇలా పక్క రాష్ట్రంలో ఎవరు గెలిస్తే ప్రయోజనమని చర్చిస్తోన్న బీఆర్ఎస్.. వైసీపీ గెలుపుపై దింపుడు కళ్ళెం ఆశలు పెట్టుకుంది. ఫ్యాన్ పార్టీ గెలుపు అసాధ్యమని రాష్ట్రంలో కూటమి గెలుపొందే అవకాశాలు ఉన్నాయనే నివేదికలు అందటం ఆపార్టీని నైరాశ్యంలోకి నేట్టేశాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ప్రవీణ్ కుమార్ ?

బీఆర్ఎస్ పార్టీ ఊపిరి పోకుండా ఉండేందుకు కేసీఆర్ అనేక రకాల సమీకరణాలపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ లేకపోవడంతో బీఆర్ఎస్‌కు ఓటు బ్యాంక్ లేకుండా పోయింది. ఆ విషయంలో...

ఐదేళ్లూ ప్రజల సొమ్ముతో జగన్ జల్సా

ముఖ్యమంత్రి ప్రజాసొమ్ముకు కస్టోడియన్. ప్రజలు శ్రమ చేసి రూపాయి రూపాయి పన్నులుగా కడితే వచ్చే సొమ్మును అంతే జాగ్రత్తగా ప్రజోపయోగం కూడా వాడాలి. కానీ జగన్ ఐదేళ్ల పాటు ఏం చేశారు. ...

చెవిరెడ్డి శ్రీవారి దర్శన వ్యాపారం రేంజే వేరు !

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి .. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్ రెడ్డి సతీమణికి తన ఇంటి పక్కన గోశాల లాంటి కుటీరం కావాలని అనిపిస్తే.. అఘమేఘాల మీద కట్టేస్తాడు....

2026 నియోజకవర్గాల పునర్విభజన: పులివెందుల ఎస్సీ నియోజకవర్గంగా మారనుందా?

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లలో కేవలం 11 సీట్లను మాత్రమే గెలుచుకొని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కుదేలయిన సంగతి తెలిసిందే. 2026 నియోజకవర్గాల పునర్విభజన లో వైఎస్ఆర్‌సీపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close