కేసుల ఎఫెక్ట్…ఒకడుగు ముందుకు…పదడుగులు వెనక్కి అన్నట్టుగా వైకాపా

తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వైసిపి ఎదురుదాడి బాగానే సక్సెస్ అయింది. టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజం కూడా వైకాపాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఇక దివాకర్స్ ట్రావెల్స్ ప్రమాదం, కేశినేని నాని గొడవ, పేపర్ లీక్ వ్యవహారంలాంటి వన్నీ కూడా వైకాపా జనాలకు ఉత్సాహాన్ని ఇచ్చినవే. అన్నింటికీ మించి ఓటుకు నోటు కేసును సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించడం కూడా వైకాపాలో ఉత్సాహాన్ని పెంచింది. కానీ వైకాపా ఉత్సాహం అంతా కూడా పాలపొంగే అని తెలియడానికి మాత్రం అట్టే టైం పట్టలేదు.

జగన్ అవినీతిపరుడు కాదు…ఆణిముత్యం అని నిరూపించాలన్న అత్యుత్సాహంలో సాక్షి చేసిన తప్పు జగన్ మెడకు చుట్టుకుంది. టిడిపికి, టిడిపి మీడియాకు ఆయుధాలనిచ్చింది. జగన్‌పైన కేసులు నిలబడవు అని చెప్పి సాక్షి మీడియాలో టెలికాస్ట్ అయిన ఇంటర్యూ అయితే సిబిఐ వాదనకు బలం చేకూర్చేలానే ఉంది. ఇక 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచీ కూడా కనీసం నత్త నడకన కూడా నడవని జగన్ కేసుల వ్యవహారంలో ఇప్పుడు కదలిక కనిపిస్తోంది. జగన్ సూట్ కేసు కంపెనీల గురించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కి బలమైన ఆధారాలే దొరకినట్టుగా ఉన్నాయి. వరుసగా చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలన్నీ వైకాపా ఉత్సాహంపైన నీళ్ళు చల్లాయి. జగన్ మరోసారి జైలకు వెళ్తాడా అన్న అనుమానాలు క్రియేట్ అయిన పరిస్థితి. తనపైన ఉన్న కేసుల గురించి ఇప్పటి వరకూ జగన్ స్పందించింది లేదు. ఇప్పుడు కూడా బెయిల్ రద్దు పిటిషన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫైండ్ అవుట్ చేసిన సూటు కేసు కంపెనీ వ్యవహారం గురించి జగన్ స్పందించే అవకాశం లేదు. అయితే వైకాపా శ్రేణుల్లో మాత్రం టెన్షన్ స్టార్ట్ అయింది. చంద్రబాబు పాలనపై వస్తున్న వ్యతిరేకత వైకాపాలో ఉత్సాహం పెంచుతున్నప్పటికీ జగన్‌పై ఉన్న కేసుల వ్యవహారం కాస్తా 2019 ఎన్నికల నాటికి ఎక్కడ మెడకు చుట్టుకుంటుందో అన్న భయం మాత్రం కనిపిస్తోంది. ఈ విషయంలో ముందు ముందు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close