దేవినేని ఉమను వెంటాడుతున్న సీబీఐ…!

మాజీ మంత్రి దేవినేని ఉమపై సీఐడీ పోలీసులు నజర్ పెట్టారు. ఆయనమార్ఫింగ్ వీడియో ప్రదర్శించారని కర్నూలులో కేసు పెట్టి.. అక్కడికే రావాలని అదే పనిగా నోటీసులు జారీ చేస్తున్నారు. రెండు రోజుల కిందట.. ఉదయం తొమ్మిదిన్నరకు విజయవాడలోని దేవినేని ఉమ ఇంటికి నోటీసులు అంటించి పదిన్నరకు తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. అయితే తాను రాలేనని పదిరోజుల సమయం కావాలని కోరుతూ ఉమ లేఖ రాశారు. ఇప్పుడు… ఆ లేఖపై ఎలాంటి స్పందన వ్యక్తం చేయని కర్నూలు సీఐడీ అధికారులు పందొమ్మిదో తేదీన రావాల్సిందేనని స్పష్టం చేస్తూ మరోసారి ఇంటికి నోటీసులు అంటించారు.

దేవినేని ఉమప్రదర్శించిన వీడియో మార్ఫింగ్ చేసిందని..కర్నూలుకు చెందిన వైసీపీ కార్యకర్త ఒకరు ఫిర్యాదు చేయడంతో సీఐడీ అధికారులు ఏకంగా ఎనిమిది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అందులో నాన్ బెయిలబుల్ కేసులు కూడా ఉన్నాయి. దీంతో అరెస్ట్ చేయాలన్న లక్ష్యంతోనే… కనీసం నాలుగైదులు జైల్లో ఉంచి.. ఆనందం పొందాలన్న టార్గెట్‌తోనే ఈ కేసులు పెట్టారని టీడీపీ అనుమానిస్తోంది. అందుకే దేవినేని ఉమఈ కేసులపైన్యాయ సలహా తీసుకుంటున్నారు. విచారణకు హాజరవ్వాలని అనుకుంటున్న ఆయన… ఈ మేరకు టీడీపీకి చెందిన న్యాయవిభాగంతో సంప్రదింపులు జరుపుతున్నారు.

వైసీపీ హిట్‌లిస్ట్‌లో దేవినేని ఉమ పేరు ఫస్ట్ డౌన్‌లోనే ఉంటుంది. ఆయనను స్పెషల్ గా టార్గెట్ చేసినట్లుగా గతంలోనే వెల్లడయింది. సీఎం జగన్‌ను దూకుడుగా విమర్శించే దేవినేని ఉమను కొద్ది రోజులు అయినా జైల్లో పెట్టాలన్న టార్గెట్‌తో ఉన్నారని అందుకే.. ఏ కేసులు దొరక్క.. ఇప్పుడు అనుచిత వ్యాఖ్యలు..మార్ఫింగ్ అంటూ.. కర్నూలులో ఫిర్యాదు చేయించారని అంటున్నారు. దేవినేనిఉమ ప్రదర్శించిన వీడియో… సాక్షి టీవీలోనూ ప్రసారమయింది. అయితే.. దాన్ని కోర్టులో నిరూపించొచ్చు కానీ.. అప్పటికే దేవినేని ఉమను కొన్నాళ్లు జైల్లో పెట్టగలరని అంటున్నారు. ఈ అవకాశం ఇవ్వకూడదని టీడీపీ న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close