ఎందుకీ ఉపఎన్నిక..!?

తిరుపతి ఉపఎన్నికలో వెలుగు చూస్తున్న చిత్రాలు.. ఔరా అనిపించేలా ఉన్నాయి. ఏ పోలింగ్‌ బూత్‌కి వెళ్లి క్యూలో నిల్చున్న వారి ఓటర్ కార్డులను పరిశీలించిన దొంగ ఓటర్లు పట్టుబడుతున్నారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి స్వయంగా క్యూలో ఉన్న వారిని ప్రశ్నిస్తే నలుగురు దొంగ ఓటర్లు పట్టుబడ్డారు. చివరికి బీజేపీ ఏజెంటె ఓటును ఓ వ్యక్తి ఓటర్ కార్డు తీసుకొచ్చి మరీ వేయబోయారు. దీంతో పోలింగ్ బూత్‌లోనే ఉన్న ఏజెంట్‌కు మైండ్ బ్లాంక్ అయింది. ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఇతర నియోజకవర్గాల నుంచి మనుషులను తెప్పించారు. వైసీపీకి చెందిన కల్యాణమండపాలు. హోటళ్లలో వారిని దింపారు. పోలింగ్ ప్రారంభమైన తర్వాత అందరూ.. రోడ్ల మీదకు వచ్చారు. వారికి కేటాయించిన పోలింగ్‌ బూత్‌లలలో ఓట్లు వేయడం ప్రారంభించారు.

ఏ పోలింగ్‌బూత్‌లో చూసినా దొంగ ఓటర్లే..!

దొంగ ఓటర్ల గుట్టును ఆలస్యంగా కనిపెట్టడంతో ఇతర పార్టీ నేతలు… ఆయా పోలింగ్ బూత్‌ల వద్ద నిఘా పెట్టారు. చాలా వరకూ దొంగ ఓట్లను పోల్ చేసుకున్నారు. విపక్ష పార్టీల నేతలు అడ్డుకున్నా.. దొంగ ఓటర్లంటూ పోలీసులకు పట్టించినా ఎలాంటిప్రయోజనం లేకపోయింది. ఏ ఒక్క పోలీసు కూడా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఎన్నికల పరిశీలకులు అడ్రస్ లేరు. ఒక్క తిరుపతి మాత్రమే కాదు.. నెల్లూరు జిల్లాలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి. నిజానికి గట్టి నిఘా.. సోదాలు ఉండాలి. ఎన్నికల సమయంలో అవి ముఖ్యం. కానీ తిరుపతి నియోజకవర్గంలోకి పోలింగ్ రోజు ఇతరులు వేల సంఖ్యలో వస్తూంటే…కనీసం సరిహద్దుల్లో ఎలాంటి చెక్‌పోస్టులు కూడా ఏర్పాటు చేయలేదు.

వ్యవస్థలన్నీ కలసికట్టుగా సహకారం..!

దొంగ ఓటర్లు కొన్ని వేల మంది వచ్చినట్లుగా స్పష్టంగా తెలియడంతో రాజకీయంగా కలకలం ప్రారంభించింది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఎన్నికల కమిషన్ కూడా… తక్షణం దొంగ ఓట్లను నిరోధించాలని బందోబస్తును పటిష్టం చేయాలని ఆదేశించింది. కానీ పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. రాజకీయ పార్టీలన్నీ తిరుపతిలో పరిస్థితిపై మండిపడ్డాయి. ప్రజాస్వామ్యాన్ని పట్ట పగలు ఖూనీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంత మాత్రం దానికి ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. తక్షణం ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కూడా అదే డిమాండ్ చేసింది. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ.. దొంగ ఓట్లను నిరోధించలేకపోతున్నారని పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. బీజేపీ నేతలు కూడా… దొంగ ఓట్ల అరాచకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారంతా శ్రీవారి భక్తులని వైసీపీ సమర్థన..!

వైసీపీ మాత్రం.. వారంతా దొంగ ఓటర్లు కాదని.. శ్రీవారి భక్తులని వాదిస్తోంది., ప్రైవేటు బస్సుల్లో శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చి పోలింగ్ బూత్‌ల వద్ద లైన్లలో నిల్చున్న వారి శ్రీవారి దర్శనం కోసం వచ్చారని.. వారిని టీడీపీ అడ్డుకుందని … చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మరో వైపు పుంగనూరుకు చెందిన పెద్దిరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టారు. వారంతా… శ్రీవారి దర్శనానికి వచ్చినవాళ్లేనని వాదించారు. ప్రజాతీర్పు తమవైపే ఉందని చెప్పుకొచ్చారు. తిరుపతి ఉపఎన్నికలో ఇటీవలి కాలంలో లేని విధంగా పెద్ద ఎత్తున దొంగ ఓట్లను తరలించుకు రావడం.. అదీ కూడా వేలల్లో ఉండటం… ఎన్నికల రాజకీయాలను చూసిన వారికి ఔరా అనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close