ప్రజాప్రతినిధుల కేసుల్లో ఏడాదిలోపు విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ..!

ప్రజాప్రతినిధులపై ఉన్న తీవ్ర నేరాల విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ ట్రయల్‌కు కేంద్రం సముఖత తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు సమాచారం ఇచ్చింది. సిట్టింగ్‌, మాజీ ప్రజాప్రతినిధులపై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ జరిపేందుకు కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని.. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌మెహతా సుప్రీంకోర్టులో వాదించారు. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను ఏడాదిలోపు పూర్తి చేయాలని దాఖలైన పిటిషన్‌ పై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఈ అంశంపై సుప్రీంకోర్టు అమికస్ క్యూరీని నియమించింది. గతంలో ఓ నివేదిక ఇచ్చిన అమికస్ క్యూరీ తాజాగా.. సప్లిమెంటరీ అఫిడవిట్‌ దాఖలు చేశారు.

విచారణ సందర్భంగా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల స్టేటస్‌పై అమికస్‌ క్యూరిని ధర్మాసనం వివరాలు అడిగింది. కొన్ని కేసుల విచారణ ప్రారంభం కాలేదన్న అమికస్‌ క్యూరి తెలిపారు. విచారణ వేగవంతం చేసేలా ట్రయల్‌ కోర్టులను ఆదేశించాలని అమికస్‌ క్యూరి న్యాయస్థానాన్ని కోరారు. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను నిర్ణీత కాలపరిమితిలో ముగించాలని ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ వాదించారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు, వసతుల కల్పనకు 2 నెలల సమయం ఇవ్వాలని కోరారు. జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని అమికస్‌ క్యూరి సూచించారు.

ఈ మేరకు ఆదేశాలిస్తామని ధర్మానసం తెలిపింది. సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. రెండు నెలల్లో జిల్లాల వారీగా కేసుల విచారణ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులపై కేసులు ఉన్నాయి. అవి కూడా ఏడాదిలో తేలిపోతే రాజకీయంగా సంచలనాలు ఖాయమని భావించవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close