కేబినెట్ భేటీపై గందరగోళంలో చంద్రబాబు..! లేనట్లేనా..?

మంత్రివర్గ భేటీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. గందరగోళ వైఖరితో ఉన్నారు. భేటీ నిర్వహించి తీరుతానని ప్రకటించిన ఆయన ఇప్పుడు ఎందుకులే అనుకుంటున్నారు. సోమవారం.. కేబినెట్ భేటీకి సీఈసీ నుంచి అనుమతి వస్తుంది. మంగళవారం భేటీ నిర్వహించాలనుకున్నారు. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీఈసీ అనుమతి ఇచ్చినా… మంత్రివర్గ భేటీ మాత్రం ఉండదనే సంకేతాలు పంపుతున్నారు.

తూచ్.. కేబినెట్ భేటీకి టైం లేదు..!

సీఈసీ నుంచి సోమవారం సాయంత్రానికి అనుమతి వచ్చినప్పటికీ, అప్పటికప్పుడు మంత్రులందరికీ సమాచారం ఇవ్వడం ఇబ్బంది అనే సాకు … వెదుక్కుంటున్నారు. అలాగే.. గంటల వ్యవధిలోనే కేబినెట్ సమావేశం ఉంటుందనే సమాచారాన్ని అధికారులకు పంపి.. హడావుడి పెట్టడం ఎందుకన్న ప్రశ్న ప్రభుత్వ వర్గాల్లోఉందట. అందుకే.. మరో తేదీన కేబినెట్ పెడదామా లేక… కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి వచ్చిన తర్వాత సంబంధిత అధికారులను పిలిపించి తగిన ఆదేశాలు ఇస్తే సరిపోతుందా.. అనే ఆలోచన ముఖ్యమంత్రి చేస్తున్నారంటున్నారు. మరో తేదీన కేబినెట్ భేటీ నిర్వహించడం అసాధ్యమే. ఎందుకంటే.. కౌంటింగ్‌కు గట్టిగా పది రోజులు కూడా లేదు.

పార్టీ వ్యవహారాల్లో బిజీ.. బిజీ..!

కేబినెట్ భేటీపై పట్టుబట్టిన… చంద్రబాబు.. ఇప్పుడు… పార్టీ వ్యవహారాల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. లోక్ సభ నియోజకవర్గాల వారీగా పార్టీ సమీక్షలో హడావుడిగా ఉన్నారు. 14వ తేదీన కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇప్పటి వరకూ ఖరారు చేసిన జాబితాలో కేబినెట్ భేటీ లేదు. పైగా.. కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు భారీ ప్రణాళికలను టీడీపీ ఖరారు చేసింది. ఇందు కోసం రెండు వందల మంది లాయర్లకు.. అమరావతిలో శిక్షణ ఇస్తున్నారు. వీరు నియోజకవర్గాలకు వెళ్లి .. కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. పోటీ చేసిన మంత్రులు దీనిని పర్యవేక్షించక తప్పదు. అందుకే వారు కూడా కేబినెట్ భేటీకి హాజరు కావడం కష్టం.

అధికారులను కట్టడి చేయడానికే ప్లాన్ చేశారా..?

తనకు అధికారం ఉందని.. నిరూపించి.. అధికారులను కట్టడి చేయడానికి మాత్రమే.. చంద్రబాబు కేబినెట్ భేటీ గురించి మాట్లాడారన్న ప్రచారం ప్రస్తుతానికి జరుగుతోంది. కేబినెట్ భేటీకి ప్రొసీజన్ ప్రారంభమయిన తర్వాత అప్పటి వరకూ… తలెగరేసిన అధికారులు.. సైలెంట్ అయ్యారు. చివరికి సీఎస్ కూడా.,. ముఖ్యమంత్రే బాస్ అన్నట్లుగా మాట్లాడుతున్నారు. దీంతో చంద్రబాబు.. తాను అనుకున్నది జరిగిందని.. ఇప్పుడు కేబినెట్ భేటీ అవసరం లేదని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎలాగూ… ఇరవై మూడున అనుకూల ఫలితం వస్తే… తలెగరేసిన అధికారుల జాబితా ఉంది కాబట్టి… దాని ప్రకారం ముందుకెళ్దామనుకుంటున్నట్లు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close