పోలవరం ఎత్తు తగ్గింపు ఎజెండా ఖరారు..!?

పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపు నిర్ణయం తీసుకోవడానికే 24వ తేదీన ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతోందని టీడీపీ నేతలు అనుమానిస్తున్నాయి. గత సోమవారం అసెంబ్లీలో… కేసీఆర్ చేసిన ప్రకటనకు కొనసాగింపుగానే… ప్రస్తుతం సమావేశం నిర్ణయం అయిందని చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. ఇదే అంశాన్ని గుర్తు చేసి.. పోలవరం ప్రాజెక్టు జోలికెళ్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. గత సోమవారం అసెంబ్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ .. కీలకమైన ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు వల్లే… తెలంగాణ, ఒడిషాతో సమస్యలు ఉన్నాయని.. ఎత్తు తగ్గిస్తే… అన్నీ సమసిపోతాయని.. చెప్పుకొచ్చారు. ఈ విషయంపై తాను జగన్ తో మాట్లాడానని… ఎత్తు తగ్గింపునకు జగన్ అంగీకరించారని కూడా.. కేసీఆర్ ప్రకటించారు.

ఈ క్రమంలో జగన్ కూడా.. దానికి 24వ తేదీన సమావేశంలో అధికారికంగా ఆమోద ముద్ర వేస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై స్పష్టమైన సమాచారం ఉందేమో కానీ.. టీడీపీ అధినేత చంద్రబాబు… మీడియా సమావేశం పెట్టి … సీఎం జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు. 71శాతం పూర్తయిన ప్రాజెక్టును విధ్వంసక చర్యల్లో భాగంగానే నిలిపివేశారని మండిపడ్డారు. పోలవరం ఎత్తు తగ్గిస్తామని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారని … ఏపీ పరిస్థితులు ఏం తెలుసని కేసీఆర్ జోక్యం చేసుకుంటున్నారుని ప్రశ్నించారు. శ్రీశైలం ద్వారా గోదావరి నీళ్లు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని .. గోదావరి – పెన్నా అనుసంధానం చేస్తే..చాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి ఇక్కడి ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దుని హెచ్చరించారు.

పోలవరం ప్రాజెక్ట్ భద్రతతో… ప్రమాదకరమైన రాజకీయ ఆట ఆడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.పోలవరం ఒక కాంప్లికేటెడ్ ప్రాజెక్టని .. 55లక్షల క్యూసెక్కుల నీటిని దృష్టిలో పెట్టుకుని దీనిని డిజైన్ చేశారని గుర్తు చేశారు. రేపు ఏదైనా జరగరానిది జరిగితే గోదావరి జిల్లాల్లో ఒక్క గ్రామం మిగలదున్నారు. ఆర్ అండ్ బీ రోడ్లు వేసుకునే వ్యక్తి చెప్పినట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక బోటు మునిగిపోతే ఇంత వరకు చెప్పలేని వాళ్లు… పోలవరం రీటెండరింగ్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. 24న పోలవరం ఎత్తు తగ్గించి… ఉమ్మడి ప్రాజెక్ట్ కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయాలు తీసుకుంటారని తెలంగాణ అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close