మీడియా వాచ్: హైకోర్టుకు చేరిన చానళ్లు బ్యాన్ వ్యవహారం..!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తున్నాయని… కొన్ని చానళ్లను బ్యాన్ చేసిన ఘటన.. హైకోర్టుకు చేసింది. ఓ న్యాయవాది.. ఈ వ్యవహారంపై.. హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు… ట్రాయ్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను.. ఎల్లుండికి వాయిదా వేసింది. దీంతో.. ఈ వ్యవహారంలో.. కీలక మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రాయ్ నిబంధనల ప్రకారం.. ఫ్రీ టు ఎయిర్ చానళ్లు 75 ప్రేక్షకులకు ఉచితంగా ఇవ్వాల్సిందే. న్యూస్ చానళ్లు కూడా ఫ్రీ చానళ్లే. నిన్నామొన్నటి వరకూ ఆ చానళ్లను ఇచ్చిన కేబుల్ ఆపరేటర్లు ప్రభుత్వ హెచ్చరికల కారణంగా నిలిపివేశారు. దీంతో.. ఆయా మీడియా సంస్థలు ట్రాయ్ కు ఫిర్యాదు చేయమని ప్రేక్షకులకు అవగాహన కల్పిస్తున్నాయి.

ట్రాయ్‌కు ఫిర్యాదు చేసిన వారికి మాత్రం.. కేబుల్ ఆపరేటర్లు… టీవీ చానళ్లను పునరుద్ధరిస్తున్నట్లుగా చెబుతున్నారు. చేయని వారికి మాత్రం… కేబుల్ ఆపరేటర్లు పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో ట్రాయ్ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. కొత్త విధానం అమలులోకి వచ్చినప్పుడు.. ప్రతీ ఖాతాదారు వద్ద.. తమకు ఏమేం చానళ్లు కావాలో జాబితా తీసుకోవాలని ట్రాయ్ నిర్దేశించింది. కానీ ఎవరూ తీసుకోలేదు. ఇదే వారికి ఇప్పుడు ఇబ్బందికరంగా మారనుంది. ఆ చానళ్లు ప్రేక్షకులకు కోరుకోలేదని.. కేబుల్ ఆపరేటర్లు వాదించడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని.. న్యాయనాద వర్గాలు చెబుతున్నాయి.

నిజానికి న్యూస్ చానళ్లు కానీ.. ఇతర చానళ్లు కానీ… కేబుల్ ఆపరేటర్ల ప్రమేయం ఉండకూడదన్న లక్ష్యంతోనే.. ట్రాయ్ కొన్ని నిబంధనలు తెచ్చింది. దాని ప్రకారం.. ఏ చానల్ ను ఉద్దేశపూర్వకంగా… ఆపడానికి అవకాశం లేదు. గతంలో… తెలంగాణలో ఏబీఎన్, టీవీ9ను నిలిపివేసినప్పుడు కూడా… కోర్టు తీర్పుతోనే.. ప్రసారాలు పునంప్రారంభమయ్యాయి. ఇప్పుడు.. న్యాయవాది దాఖలు చేసిన పిల్ పై… ట్రాయ్ … దాఖలు చేసే.. కౌంటర్… ఆధారంగా… కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close