ఒకప్పుడు తాను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే ఎగతాళి చేశారని ఇప్పుడు భార్య లేకుండా భర్త.. భర్త లేకుండా భార్య ఉండగలుగుతున్నారు కానీ.. సెల్ ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నట్లుగా పరిస్థితి మారిందని ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. విజయవాడలో క్వాంటం కంప్యూటింగ్ వర్క్ షాప్లో చందర్బాబు మాట్లాడారు. ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ కలిసి అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నాయి. ఈ క్రమంలో విజయవాడలో వర్క్ షాప్ నిర్వహించారు.
ఓ పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే.. దానికి తగ్గ ఎకో సిస్టమ్ను డెలవప్ చేయాల్సి ఉందని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ను ఐటీ రంగానికి కేంద్రంగా చేయాలంటే.. ఎలాంటి ఎకోసిస్టమ్ ఉండాలో అమెరికాలో అధ్యయనం చేసి దానికి తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకున్నామని గుర్తు చేశారు. అప్పట్లో తాను ఐటీ, సెల్ ఫోన్ల గురించి మాట్లాడితే విమర్శలు చేసేవారని గుర్తు చేసుకున్నారు. బ్రిటిష్ వాళ్లు మన కోహినూరు డైమెండ్ను తీసుకుపోయినా ఇంగ్లీష్ వదిలి వెళ్లారు. మొదటి సారి సీఎం అయినప్పుడు ఐటీ పరిశ్రమల కోసం అమెరికా వెళ్లినప్పుడు పరిశ్రమకు ఏమి అవసరమో గుర్తించి.. దానికి తగ్గట్లుగా అనేక ఇంజనీరింగ్ కాలేజ్లు ప్రారంభించి ఐటీ ఎడ్యూకేషన్ను పెంచాననన్నారు.
జనవరి ఒకటోవ తేదీ నాటికి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అమరావతి నుంచి ప్రారంభమవుతుంది. ఫ్యూచర్ టెక్నాలజీ అంతా.. క్వాంటం కంప్యూటింగ్ మీద ఆధారపడి ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో అమరావతిలో సిలికాన్ వ్యాలీ తరహాలో క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏర్పాటు ప్రయత్నిస్తున్నారు.