మోదీ, షాలతో భేటీకి ఢిల్లీకి చంద్రబాబు !

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్తున్నారు. శనివారం ఉదయం వరకూ ఆయన ఢిల్లీ పర్యటన గురించి సీక్రెట్ గానే ఉంది. శనివారం సాయంత్రం అమిత్ షాతో… ఆదివారం ప్రధాని మోదీతో భేటీ అవుతారన్న ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ఏమీ అధికారంలో లేరు కాబట్టి వారితో ఎలాంటి అధికారిక విషయాలు చర్చించే అవకాశం లేదు. కేవలం రాజకీయ అంశాలపై మాత్రమే చర్చించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

టీడీపీని ఎన్డీఏలో చేర్చుకోవద్దని తానే ఎన్డీఏలో చేరుతానని సీఎం జగన్ ఆఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే కొన్ని విషయాన్ని బీజేపీ నుంచి వైసీపీకి సహకారం అందుతోందని చెబుతున్నారు. అయితే అనూహ్యంగా చంద్రబాబును మోదీ, షా పిలవడంతో ఇప్పుడు ఏమైనా కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా అన్న చర్చ జరుగుతోంది. ఇటీవల పలు సందర్భాల్ల మోదీ విధానాలను తాను సమర్థిస్తానని .. ఎన్డీఏలో చేరికపై కాలమే నిర్ణయిస్తుందని చెబుతున్నారు.

ఏపీలో ఉన్న అధికార పార్టీ బీజేపీకి అడ్డం తిరగడానికి ఏ మాత్రం సిద్ధంగా లేదు. వారు చెప్పినవన్నీ చేయాల్సి వస్తోంది. ఇలాంటి పార్టీని వదులుకుని టీడీపీతో బీజేపీ జట్టు కడుతుందా అన్నది కూడా సందేహమే. పొత్తులేమీ అక్కర్లేదని.. ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చూస్తే చాలని.. ఎన్నికల తర్వాత మద్దతుగా ఉంటామని టీడీపీ వర్గాలు ప్రతిపాదిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కారణం ఏదైనా ఎన్నికల వేడి ప్రారంభమైన సమయంలో మోదీ , షాలతో చంద్రబాబు భేటీ కానుండటం చర్చనీయాంశం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close