జగన్ అడిగితే బీజేపీ కాదంటుందా !?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. సమీర్ శర్మ ఈనెల 31వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన సేవలు అవసరమని సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అలా అడగడం ఆలస్యం ఇలా అనుమతి వచ్చింది. నవంబర్ నెలాఖరు వరకూ ఆయన అదనంగా సీఎస్ పదవిలో ఉంటారు. సమీర్ శర్మ గత ఏడాది అక్టోబర్ ఒకటో తేదీన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు.

ఆయన రిటైర్మెంట్ గడువు నవంబర్ 30. అంటే రెండు నెలలు మాత్రమే సీఎస్‌గా ఉండాలి. కానీ సీఎం జగన్ ఆయనకు రెండు విడతలుగా ఆరేసి నెలల పాటు పొడిగింపు ఇప్పించడంతో మరో ఏడాది అదనంగా సర్వీసులో ఉంటున్నారు. సాధారణంగా సీఎ్‌సలకు ఆరు నెలలకు మించి పొడిగింపు ఇవ్వరు. గతంలో ఒక్క సారే కాకి మాధవరావుకు ఏడాది పొడిగింపు ఇచ్చారు. గతంలో సీఎస్‌ నీలం సాహ్నికి మూడు నెలల చొప్పున రెండు విడతలుగా పొడిగింపు ఇచ్చారు.

కానీ సమీర్‌ శర్మకు మొదట ఒకేసారి ఆరు నెలలు పొడిగింపు దక్కింది. రెండో సారి మరో ఆరు నెలల పొడిగింపు దక్కించుకున్నారు. నిజానికి మోడీ సర్కార్ పదవీ కాలం ముగిసిన ఎవరికీ పొడిగింపు ఇవ్వకూడదని విధాన నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు హయాంలో పొడిగింపు ఇవ్వలేదు. అయితే బీజేపీ ..బీజేపీకి ఇష్టమైన ప్రభుత్వాలు ఉన్న చోట్ల మాత్రం పట్టించుకోవడం లేదు. అడగగానే ఇచ్చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close