అంతా అయిపోయాక ఇప్పుడెందుకు చిరూ..?

సినిమా ప్ర‌చారం కూడా ఓ స్ట్రాట‌జీనే. అంతా ఓ ప్లాన్ ప్ర‌కారం చేసుకుంటూ వెళ్లాలి. పెద్ద సినిమాల‌కు, వందల కోట్ల పెట్టుబ‌డితో తీసిన భారీ చిత్రాల‌కు ఆ ప్లానింగ్ చాలా అవ‌స‌రం. ఈ విష‌యంలో `సైరా` చాలా వెన‌క‌బ‌డిందనే చెప్పాలి. అది ప‌రోక్షంగా వ‌సూళ్ల‌పైనా ప్ర‌భావం చూపించింది. స‌రైన స‌మ‌యంలో, స‌రైన రీతిలో ప్ర‌చారం చేసుకోక‌పోవ‌డం వ‌ల్ల సైరాకి రావల్సినంత మైలేజీ రాలేదు. అయితే ఈ మ‌ధ్య చిరంజీవి కాస్త మేల్కొని జ‌గ‌న్‌ని క‌లిశాడు. ఇప్పుడు ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు తో భేటీ అయ్యారు. ఈ ప్ర‌య‌త్నాలు సైరాని ఇంకొన్ని రోజులు వార్త‌ల్లో ఉంచ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అంతే త‌ప్ప‌.. వ‌సూళ్ల‌పై ఎలాంటి ప్ర‌భావం చూప‌దు.

సైరాకి ప‌బ్లిసిటీ పెంచుకోవాల‌ని, త‌ద్వారా మ‌రిన్ని వ‌సూళ్లు రాబ‌ట్టుకోవాల‌ని చిరు భావిస్తే ఈ ప‌నేదో ముందే చేయాల్సింది. సైరాకి సంబంధించి ఇటీవ‌ల జ‌గ‌న్ ట్వీట్ చేశారు. విడుద‌లైన ఒక‌ట్రెండు రోజుల్లో జ‌గ‌న్ నుంచి ఈ ట్వీటు ప‌డి ఉంటే, ఫ‌లితం మ‌రోలా ఉండేది. ఇప్ప‌టికిప్పుడు వెంక‌య్య నాయుడు `సైరా` సినిమా చూసి, చిరునీ, టీమ్‌నీ పొగ‌డ్త‌ల‌తో ముంచేయ్య‌డం వ‌ల్ల క‌లిగే లాభ‌మేమీ ఉండ‌దు. ఎందుకంటే ఇప్ప‌టికే సైరా ఫైన‌ల్ ర‌న్ ద‌శ‌కు వ‌చ్చేసింది. చూడాల్సిన వాళ్లు చూసేశారు. అమేజాన్‌లో చూద్దామ‌నుకున్న‌వాళ్లు ఆగిపోయారు. సైరా హ‌డావుడి దాదాపుగా ముగిసిపోయింది. ఏదైనా వేడిలో ఉన్న‌ప్పుడే జ‌రగాలి. అది సినిమా ప్ర‌చారానికీ వ‌ర్తిస్తుంది. సినిమాపై ఓ అభిప్రాయానికి జ‌నం వ‌చ్చేసిన త‌ర‌వాత‌.. ఇలాంటి ప్ర‌య‌త్నాలు త‌గిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేవు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close