అందుకే డైరెక్ష‌న్ చేయ‌లేదు: చిరంజీవి

ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి క‌థ‌ని సినిమాగా తీయాల‌న్న‌ది ఇప్ప‌టి ఆలోచ‌న కాదు. దాదాపు ఈ క‌థ ప‌దిహేనేళ్ల నుంచీ న‌లుగుతూనే ఉంది. ద‌ర్శ‌కులుగా కొంత‌మంది పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఓ ద‌శ‌లో వినాయ‌క్ ఈ సినిమా చేస్తాడ‌ని చెప్పుకున్నారు. చివ‌రికి సురేంద‌ర్ రెడ్డికి ఈ అవ‌కాశం ద‌క్కింది. నిజానికి.. ఈ సినిమాకి డైర‌క్ష‌న్ చేయాల‌న్న ఆలో్చ‌న చిరుకి కూడాఉండేద‌ట‌. ఈ సినిమాకి మీరే ద‌ర్శ‌క‌త్వం వ‌హించండి అంటూ ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ లాంటి వాళ్లు స‌ల‌హా ఇచ్చార్ట‌. కానీ చిరంజీవి మాత్రం ఒప్పుకోలేదు. ఈ విష‌యాన్ని `సైరా` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు చిరంజీవి.

”న‌ట‌న ద‌ర్శ‌క‌త్వం రెండు ప‌నులూ ఒకేసారి చేయ‌డం సాధ్యం కాదు. అయితే డైర‌క్ష‌న్‌, లేదంటే న‌ట‌న‌. రెండింటిలో ఏదో ఒక‌టి ఎంచుకుంటాను అని చెబితే.. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ కంగారు ప‌డ్డారు. ‘మీరు న‌టించండి.. డైర‌క్ష‌న్ వ‌ద్దు’ అన్నారు. ధృవ త‌ర‌వాత సురేంద‌ర్‌రెడ్డి ప‌నిత‌నం తెలిసింది. ఈ సినిమాకి త‌నైతే న్యాయం చేస్తాడ‌ని చ‌ర‌ణ్ చెప్పాడు. సురేంద‌ర్‌రెడ్డిని పిలిచి సినిమా చేతుల్లో పెడితే ఎగిరి గంతేస్తాడ‌నుకున్నాం. కానీ రెండు నెల‌లు స‌మ‌యం కావాలి అని మ‌మ్మ‌ల్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. రెండు నెల‌ల త‌ర‌వాత తిరిగొచ్చి `నేను చేస్తా`అని చెప్ప‌డం సంతోషం క‌లిగించింది. చ‌రిత్ర‌ని ఎక్క‌డా వ‌క్రీక‌రించ‌కుండా చ‌క్క‌టి వాణిజ్య విలువ‌ల‌తో ఈ సినిమాని తెర‌కెక్కించాడ‌”న్నారు చిరంజీవి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close