టీడీపీకి “కన్వర్టడ్ క్రిస్టియన్” నేతల గుడ్ బై..!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్రిస్టియన్లకు వ్యతిరేకంగా మాట్లాడారంటూ.. ఆ పార్టీకి చెందిన క్రిస్టియన్ సెల్ నేతలు కూడబలుక్కుని పార్టీకి రాజీనామా చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ మతాన్ని నిర్లక్ష్యం చేస్తూ.. పాస్టర్ల పేరుతో క్రిస్టియన్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేస్తున్నారని..బలవంతపు మత మార్పిడులకు ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు టీడీపీ అధినేత చేశారు. అయితే.. ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు సైలెంట్‌గానే ఉన్న నేతలు.. ఇప్పుడు అందరూ… కలిసి.. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. జిల్లాల క్రిస్టియన్ సెల్ అధ్యక్షులందరూ రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. గత వారం మాజీ నామినేటెడ్ ఎమ్మెల్యే ఫిలిప్ తోచర్ అనే నేత కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత క్రిస్టియన్ నేతలందరూ అసంతృప్తిలో ఉన్నారన్న ప్రచారం జరిగింది.

టీడీపీ హయాంలో పలు రకాల నామినేటెడ్ పోస్టులు పొందిన వారు కూడా.. అసంతృప్తిగా ఉన్నారని వారు కూడా పార్టీకి రాజీనామా చేస్తారని చెబుతున్నారు. అయితే.. వీరందరూ వెళ్లిపోవాలన్నట్లుగా టీడీపీ నేతల వ్యవహారశైలి ఉంది. తాము పార్టీ నుంచి వెళ్లిపోతామంటే.. ఒక్కరు కూడా స్పందించడం లేదని కొంత మంది నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. అయితే.. టీడీపీ కూడా ఈ విషయంలో కావాలనే వారందరూ బయటకు పోవాలన్నట్లుగా ఉంటున్నారని చెబుతున్నారు. కన్వర్టడ్ క్రిస్టియన్స్ ఎప్పుడూ.. టీడీపీకి ఓటు బ్యాంక్‌గా లేదని.. కానీ వారిని ఎప్పుడూ టీడీపీ దూరం పెట్టలేదని.. గౌరవంగా చూసినా… ఇప్పుడు చాన్స్ తీసుకోవాలని అనుకుంటున్నారని అంటున్నారు.

అదే సమయంలో… ప్రస్తుతం సమాజంలో ఏర్పడిన పరిస్థితుల్లో.. ఆ వర్గం అంతా.. ఒక పార్టీదే అన్న ప్రచారం జరుగుతోంది. ఆ ముద్ర మరింత బలంగా ఉండాలంటే.. టీడీపీలో వారు ఉండకపోతే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా అంచనా వేస్తున్నారు. మొత్తానికి .. ఏపీలో రాజకీయాల మతాల ప్రకారం.. వర్గీకరణ జరుగుతున్నాయి. కొన్ని పార్టీలపై మత ముద్ర వేయడం.. వేయించుకోవడం కోసం వ్యూహాలు పన్నుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దూరదర్శన్ లోగో కలర్ మార్పు… కారణం అదేనా..?

దూరదర్శన్... చాలా ఫేమస్ ఛానెల్. అప్పట్లో ఎక్కడ చూసినా దూరదర్శన్ ప్రసారాలే.అందుకే దూరదర్శన్ ఛానెల్ కు ఇప్పటికీ అసంఖ్యాకమైన ప్రేక్షకులు ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నా, సడెన్ గా దూరదర్శన్ లోగో కలర్...

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close