చొరబాటుదారులందరికీ పౌరసత్వం..! ముస్లింలకు తప్ప..!

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. అత్యంత వివాదాస్పదమైన బిల్లును.. ఆమోదించడానికి రంగం సిద్దం చేసుకుంది. ఇది పూర్తిగా ఓటు బ్యాంక్‌ను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న చట్టంగా తీవ్ర విమర్శల పాలవుతోంది. అదే పౌరసత్వ సవరణ బిల్లు. దీన్ని సోమవారమే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలన్న పట్టుదలతో కేంద్రం ఉంది. దీన్ని విపక్ష పార్టీలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కారణం… పౌరసత్వ సవరణ బిల్లులో ప్రధానాంశం… చొరబాటుదారులకు దేశ పౌరసత్వం ఇవ్వడం. అందరికీ.. ఇస్తే.. పార్టీలేవీ.. పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేసేవి కావేమో కానీ… ఒక్క ముస్లింలకు తప్ప.. అందరికీ పౌరసత్వం ఇచ్చేలా బిల్లులో నిబంధనలు పొందు పరిచారు.

బెంగాల్ తో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లో వాటికి సరిహద్దు ఉన్న పొరుగు దేశాల నుంచి పెద్ద ఎత్తున వలసలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వారు.. కొన్ని రాష్ట్రాల్లో మెజార్టీలుగా మారారు. వీరిని గుర్తించేందుకు జాతీయ పౌరసత్వ రిజిస్టర్ ను తీసుకొచ్చిన కేంద్రం.. ఆ జాబితాలో చోటు దక్కని వారికి అధికారికంగా పౌరసత్వం ఇవ్వనుంది. అయితే.. ఈ అవకాశాన్ని ముస్లింలకు మాత్రం ఇవ్వడం లేదు. పొరుగు దేశాల నుంచి వలస వచ్చిన హిందువులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, పార్శీలుకు ఈ బిల్లు ద్వారా పౌరసత్వం ఇస్తారు.

అయితే మతప్రాతిపదిక పౌరసత్వాన్ని కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్, సీపీఎం సహా విపక్ష పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. ఓటు బ్యాంక్ రాజకీయాలకు.. కేంద్రం పాల్పడుతోందని.. ఆయా పార్టీలు మండి పడుతున్నాయి. ఇస్తే అందరికీ ఇవ్వాలి.. లేకపోతే ఎవరికీ ఇవ్వవద్దన్న విధానాన్ని.. అన్ని రాజకీయ పార్టీలు అవలంభిస్తున్నాయి. అయితే.. ఇప్పుడు కేంద్రం.. అనుకున్నది చేసేస్తోంది.. ఇతర పార్టీల అభిప్రాయాలను పట్టించుకునే పరిస్థితి లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

నిస్సహాయుడిగా కేసీఆర్..!?

బీఆర్ఎస్ నేతలపై కేసీఆర్ పట్టు కోల్పోతున్నారా..? క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఆ పార్టీలో క్రమశిక్షణ లోపిస్తుందా..? నేతలు హద్దులు దాటుతున్న చర్యలు తీసుకోని నిస్సహాయ స్థితికి కేసీఆర్ చేరుకున్నారా..? అంటే అవుననే...
video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close