మళ్లీ..మళ్లీ అత్యాచారాలు..! ఎన్‌కౌంటర్‌ భయం ఏది..?

అత్యాచారాలకు పాల్పడిన వారిని తక్షణం ఎన్‌కౌంటర్ చేసి పారేస్తే… మరోసారి అలాంటి నేరాలు చేయడానికి భయపడతారంటూ…వచ్చిన విశ్లేషణలు.. తేలిపోతున్నాయి. దిశపై హత్యాచారానికి పాల్పడిన మృగాళ్లు నలుగురిని ఎన్‌కౌంటర్ చేసేసినా.. ఆ ఎన్‌కౌంటర్ రచ్చ ఇంకా జరుగుతున్నా.. అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. దేశవ్యాప్తంగా.. అత్యాచారాల కేసులు, ఆగడాలపై.. చర్చ జరుగుతున్నా… మృగాళ్ల తీరులో మార్పు రాలేదు. తిరుపతిలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఓ పధ్నాలుగేళ్ల బాలికను..లిఫ్ట్ ఇస్తామని చెప్పి.. తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. వీరిలో ఒకరు రౌడీషీటర్.

తిరుపతి పద్మావతిపురం సర్కిల్‌ వద్ద పద్నాలుగేళ్ల మైనర్‌ బాలిక తిరుచానూరుకు వెళ్లేందుకు అటుగా వెళ్తున్న ద్విచక్రవాహనదారుడు చిత్తూరు వెంకటేశ్‌ను లిఫ్ట్‌ అడిగింది. ఆమెను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని వెళ్తూ అతని స్నేహితుడూ, రౌడీషీటర్‌ అయిన రాజానాయక్‌కు సమాచారం ఇచ్చాడు. తిరుచానూరులో వాహనాన్ని ఆపకుండా సమీపంలోని ముండ్లపూడిలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి బాలికను తీసుకెళ్లారు. అక్కడ వారిద్దరూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు.

ఇది మాత్రమే కాదు.. విజయవాడలోనూ ఓ చిన్నారిపై అత్యాచారం ఘటన వెలుగు చూసింది. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లోనూ.. ఇలాంటి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయితే.. దిశ కేసు మీడియా దృష్టిని ఆకర్షించింది. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అందుకే.. ఆ కేసులో.. నిందితుల్ని.. ఉన్న పళంగా ఎన్ కౌంటర్ చేసేసి.. న్యాయం చేశామనిపించారు. వాళ్లను అలా చంపేస్తే.. ఇతర చోట్ల నేరాలు చేసే వారికి భయం వస్తుందన్న అభిప్రాయాలు అంతటా వినిపించాయి. కానీ.. అలాంటిదేమీ ఉండదని.. తరచూ వెలుగు చూస్తున్న అత్యాచర ఘటనలు నిరూపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close